‘ప్రతి మహిళా పోలీసు ఒక స్టార్’.. ‘షీ పాహి’ కార్యక్రమంలో అనుష్క..

‘ప్రతి మహిళా పోలీసు ఒక స్టార్’.. ‘షీ పాహి’ కార్యక్రమంలో అనుష్క..

Anushka Shetty: షీ టీమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఫిల్మ్ నగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగిన ‘షీ పాహి’ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్, మహిళా పోలీసు ఉద్యోగులు, అదనపు డీజీ స్వాతి లక్రా, షీ టీమ్స్ డీసీపీ అనసూయ తదితరులు పాల్గొన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

Anushka

ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ.. ‘‘ప్రతి మహిళా పోలీసు ఒక స్టార్.. కోవిడ్ సమయంలో పోలీసులు చాలా బాగా పనిచేశారు.. తెలంగాణలో ఇంతమంది మహిళా పోలీసులు ఉండడం ఎంతో సంతోషకరం’’.. అన్నారు.

Anushka

ఈ సందర్భంగా మూడు క్విక్ రెస్పాన్స్ వాహనాలతో పాటు షీ షటిల్ సర్వీసులను ప్రారంభించారు. ట్రాఫిక్, సైబర్ క్రైమ్ సహా అన్ని విభాగాల్లోనూ మహిళా పోలీసులు పని చేస్తున్నారని, సైబరాబాద్ కమిషనరేట్‌లో 12 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని సజ్జనార్ తెలిపారు.

Anushka