Dream11 Contest : లక్కేలక్కు, కటింగ్ యజమాని కోటీశ్వరుడు..అయినా..వృత్తిని వదులుకోనంటున్నాడు

సెలూన్ నిర్వహించే యజమాని అదృష్టం తలుపు తట్టింది. కోటీశ్వరుడు అయిపోయాడు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా అతను రూ. కోటి దక్కించుకున్నాడు

Dream11 Contest : లక్కేలక్కు, కటింగ్ యజమాని కోటీశ్వరుడు..అయినా..వృత్తిని వదులుకోనంటున్నాడు

Online Betting

Barber Wins Jackpot : అదృష్టం ఎలా వస్తుందో తెలియదు. నిన్నటి వరకు పేదవాడిగా బతికిన వ్యక్తి..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోతాడు. లాటరీ ద్వారా, ఆన్ లైన్ బెట్టింగ్..ఇలా తదితర రూపాల్లో వారికి లక్ష్మీ వరిస్తుంటుంది. లక్షాధికారులు, కోటీశ్వరులు అవడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. ఇలాగే..ఓ సెలూన్ నిర్వహించే యజమాని అదృష్టం తలుపు తట్టింది. కోటీశ్వరుడు అయిపోయాడు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా అతను రూ. కోటి దక్కించుకున్నాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Yadagirigutta : యాదాద్రికి స్వామి ఖజానాకు రూ. 4,13,283..క్షేత్రపాలకుడికి ఆకుపూజ

మధుబనీ జిల్లాలో నానూర్ చౌక్ ప్రాంతంలో అశోక్ కుమార్ ఠాకూర్ సెలూన్ నిర్వహిస్తూ..కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి క్రికెట్ అంటే పిచ్చి అభిమానం. అంతేగాకుండా..ఆన్ లైన్ లో కొద్ది కొద్దిగా బెట్టింగ్ పెట్టేవాడు. ఎప్పటికైనా అదృష్టం వరించదా అనుకుంటూ..బెట్టింగ్ లు పెట్టేవాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2021 సీజన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కూడా బెట్టింగ్ లు పెట్టడం ప్రారంభించాడు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ పై అశోక్ కుమార్ బెట్టింగ్ పెట్టాడు. అనూహ్యంగా రూ. కోటి దక్కించుకున్నాడు. ఈ సంగతి తెలియగానే అశోక్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గతంలో ఎన్నోసార్లు బెట్టింగ్ పెట్టినా..అదృష్టం రాలేదని తెలిపారు. రూ. కోటి వచ్చినా..తన వృత్తిని మాత్రం వదులుకోనని, వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చి..ఇల్లు కట్టుకుంటానని తెలిపాడు.