Radhe Shyam: కరోనాతో జాగ్రత్త.. రాధేశ్యామ్ దర్శకుడి ట్వీట్ దుమారం!

కొత్త ఏడాదిలో పరిస్థితి సంతోషకరంగా ఉండాలనుకుంటే.. మాయదారి మహమ్మారి కరోనా మాత్రం మన సమాజం నుండి వదిలి వెళ్లడం లేదు. దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ టెన్షన్ మొదలైంది.

Radhe Shyam: కరోనాతో జాగ్రత్త.. రాధేశ్యామ్ దర్శకుడి ట్వీట్ దుమారం!

Radhe Shyam

Radhe Shyam: కొత్త ఏడాదిలో పరిస్థితి సంతోషకరంగా ఉండాలనుకుంటే.. మాయదారి మహమ్మారి కరోనా మాత్రం మన సమాజం నుండి వదిలి వెళ్లడం లేదు. దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ టెన్షన్ మొదలైంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో కేసులు పెరుగుతుండడంతో ప్రజలలో ఆందోళన కనిపిస్తుంది. మిగతా రంగాల పరిస్థితి ఎలా ఉన్నా సినిమా విషయంలో దీని ప్రభావం ముందు కనిపిస్తుంది. పలు రాష్ట్రాలలో ఆంక్షలతో థియేటర్ల వ్యవహారం మళ్ళీ సీటింగ్ తగ్గించేలా చేసింది. దీంతో సంక్రాంతికి వస్తాయన్న భారీ సినిమాలు కూడా వెనక్కు తగ్గాయి.

Radhe Shyam: స్పీడ్ పెంచుతున్న ప్రమోషన్లు.. ప్రభాస్ కోసం ఫ్యాన్స్ చూపులు!

ఇప్పటికే ఇండియన్ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ వాయిదా పడగా.. రాధేశ్యామ్ కూడా వాయిదా పడుతుందా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. మేకర్స్ వాయిదా ఛాన్స్ లేదని చెప్పిన టైంకి వస్తామని ధీమాగా చెప్తున్నా పరిస్థితులు అనుకూలంగా మాత్రం లేవు. సినిమా నిర్ణయం ఏంటన్నది తొలి వారం గడిస్తే కానీ తెలియదని అంచనా వేస్తుండగా రాధేశ్యామ్ దర్శకుడు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ప్రభాస్ అభిమానులలో దుమారం రేపుతోంది. ఒకవిధంగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చేసిన ఈ ట్వీట్ రాధేశ్యామ్ సినిమా వాయిదా పడుతుందని హింట్ ఇచ్చాడా అనిపిస్తుంది.

Radheshyam : 12 దేశాల్లో ‘రాధేశ్యామ్’ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్

కరోనాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. ఈ సమయం కఠినమైనది.. హృదయాలు బలహీనంగా ఉన్నాయి.. మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా.. మన ఆశలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. సురక్షితంగా ఉండండి.. ఉన్నతంగా ఉండండి అంటూ రాధేశ్యామ్ టీం అని ట్వీట్ చేశాడు. దీంతో వాయిదా పడుతుందని హిట్ ఇచ్చారా అని ఆయన్నే ప్రశ్నించగా.. అలాంటిది ఏదైనా ఉంటే డైరెక్ట్ గానే చెప్తామని క్లారిటీ ఇచ్చాడు. అయితే.. అసలు ఇలా దర్శకుడు అనడం వెనక కారణం వాయిదానే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.