BiggBoss Non Stop : ఈ సారి బిగ్బాస్ విన్నర్ ఆమెనే.. కౌశల్ జోస్యం..
కౌశల్ మండా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ సారి విన్నర్ ఎవరు అవుతారో చెప్పేశాడు. కౌశల్.. ''బిగ్బాస్ షోలో ఎవరు గెలుస్తారు అనే దానిపై నా అంచనాలు ఎప్పుడూ తప్పుకాలేదు. ఈసారి......
BiggBoss Non Stop :బుల్లితెరపై రావాల్సిన రియాల్టీ షో బిగ్బాస్ ఈ సారి ఓటీటీ వేదికగా నాన్స్టాప్ టెలికాస్ట్ అవుతుంది. ఇప్పటికే బిగ్బాస్ నాన్ స్టాప్ మొదలయి రెండు వారాలు పూర్తి చేసుకుంది. 17 మందితో ఈ షో ప్రారంభం అవ్వగా ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకొని ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేట్ అయ్యారు. ఇక షోలో గేమ్ పాత కంటెస్టెంట్స్ వారియర్స్ వర్సెస్ కొత్త కంటెస్టెంట్స్ చాలెంజర్స్ మధ్య జరుగుతుంది.
అయితే ఈ సారి ఎవరు విన్ అవుతారో చెప్పడం కొంచెం కష్టమే. ఆల్రెడీ అనుభవం ఉన్న పాత కంటెస్టెంట్స్ ఉన్నారు. అలాగే కొత్త కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. ఆట పరంగా చూస్తే పాత కంటెస్టెంస్ట్స్ తమ అనుభవంతో గెలవొచ్చు. కానీ లాజికల్ గా ఆలోచిస్తే కొత్త కంటెస్టెంట్స్ కే విన్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా బిగ్బాస్ నాన్స్టాప్ షోపై బిగ్బాస్ మాజీ విన్నర్ కౌశల్ మండా ఆసక్తికర కామెంట్లు చేశాడు .
BiggBoss Non Stop : బిగ్బాస్ చరిత్రలోనే మొదటి సారి.. ఈ వారం నామినేషన్స్ లో 12 మంది..
కౌశల్ మండా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ సారి విన్నర్ ఎవరు అవుతారో చెప్పేశాడు. కౌశల్.. ”బిగ్బాస్ షోలో ఎవరు గెలుస్తారు అనే దానిపై నా అంచనాలు ఎప్పుడూ తప్పుకాలేదు. ఈసారి బిగ్బాస్ ఓటీటీ సీజన్లో బిందుమాధవి గెలుస్తుంది అని అనుకుంటున్నాను. నేను షో చూస్తున్నాను. అందులో బిందుమాధవి యాటిట్యూడ్, ఆమె సామర్థ్యాలు ఆవిడే గెలుస్తాయని చెప్తున్నాయి. బిందు మాధవి గెలవడానికి 90 శాతం ఛాన్స్ ఉంది. ఇక రీఎంట్రీ ఇచ్చిన కొందరు కంటెస్టెంట్లు బిగ్బాస్ గేమ్ను అర్థం చేసుకోవడంలో ఇప్పటికి కూడా తడబడటం చూస్తుంటే నవ్వొస్తోంది” అంటూ పోస్ట్ చేశాడు. మరి నిజంగానే కౌశల్ మండా జోస్యం నిజమవుతుందా? లేదా? చూడాలి. ఒకవేళ తాను చెప్పినట్టు బిందు మాధవి బిగ్బాస్ విన్నర్ అయితే తెలుగులో మొదటిసారి విన్ అయిన లేడీ కంటెస్టెంట్ గా రికార్డు సృష్టిస్తుంది.