Biological E: ‘కరోనా వ్యాక్సిన్ మూడో డోసు ప్రయోగాలకు అనుమతి కావాలి’

కరోనా వైరస్‌లో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకున్నప్పటికీ.. మూడో డోసు అవసరమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.

Biological E: ‘కరోనా వ్యాక్సిన్ మూడో డోసు ప్రయోగాలకు అనుమతి కావాలి’

Covid Vaccine

Biological E: కరోనా వైరస్‌లో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకున్నప్పటికీ.. మూడో డోసు అవసరమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అటు డబ్ల్యూహెచ్ఓ కూడా బూస్టర్ డోస్ తీసుకోవడమే మంచిదని సూత్రప్రాయం తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్ లోనూ ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయియ. హైదరాబాద్ కు చెందిన ఫార్మా సంస్థ బయోలాజికల్ – ఇ.. తాము అభివృద్ధి చేస్తున్న కార్బివాక్స్ టీకాను బూస్టర్ డోసు కింద పంపిణీ చేయాలని భావిస్తోంది.

ఇప్పటికే కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నవారికి కార్బివాక్స్ ను బూస్టర్ డోసుగా ఇచ్చాలా మూడో దశ క్లినికల్ ప్రయోగాలకు అనుమతివ్వాలిని కేంద్ర ఔషద నియంత్రణ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది.

ప్రస్తుతం కార్బివాక్స్ టీకా రెండు, మూడు దశల క్లినికల్ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. 18 నుంచి 80ఏళ్ల లోపు వారిపై ఈ పరీక్షలు జరుపుతున్నారు. ఈ నెలాఖరులో ఆ ప్రయోగాల ఫలితాలను కంపెనీ వెల్లడించనుంది. ఈ టీకాకు ఇంకా డీసీజీఐ అనుమతులు రాకముందే.. కేంద్రం ప్రభుత్వం 30కోట్ల డోసులకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.1500కోట్లు చెల్లించింది కూడా.

………………………………………………… : బొగ్గు తవ్వకాలను నిరసిస్తూ…300 కి.మీ పాదయాత్ర

ఇలాంటి సమయంలో బూస్టర్ డోస్ ప్రయోగాల కోసం బయోలాజికల్ – ఇ డీసీజీఐ అనుమతి కోరింది. ఇప్పటికే కొవాగ్జిన లేదా కొవీషీల్డ్ టీకా తీసుకున్నవారికీ కార్బివాక్స్ ను బూస్టర్ డోసుగా ఇచ్చి మూడో దశ ప్రయోగాలు చేపట్టాలని భావిస్తోంది.

టీకా తీసుకున్న కొన్ని నెలల తర్వాత యాంటీబాడీలు తగ్గుతున్నాయని ఇప్పటికే చాలా అధ్యయనాలు వెల్లడించాయి. దీంతో చాలా దేశాలు బూస్టర్ డోసుపై దృష్టిపెట్టాయి. కొన్నిదేశాలు ఇప్పటికే పంపిణీ కూడా ప్రారంభించాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేం కూడా ఈ దిశగా ప్రయోగాలు చేపట్టాలనుకుంటున్నాం. కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండు డోసులు పూర్తయి, కొవిడ్ నెగెటివ్ ఉన్న వాలంటీర్లపై ఈ ప్రయోగాలు జరపాలనుకుంటున్నాం’ అని బయోలాజికల్ – ఇ వెల్లడించింది. దీనిపై నిపుణుల కమిటీ తమ తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.