Bride refuses to marry: మద్యం తాగిన వరుడు.. పెళ్లి రద్దు చేసుకున్న వధువు
కొద్దిసేపట్లో పెళ్లి జరగబోతుండగా పీకలదాకా తాగొచ్చాడు పెళ్లికొడుకు. మద్యం మత్తులో ఉన్న పెళ్లి కొడుకుని చూసి, అతడ్ని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది పెళ్లి కూతురు.

Bride refuses to marry: కొద్దిసేపట్లో పెళ్లి జరగబోతుండగా పీకలదాకా తాగొచ్చాడు పెళ్లికొడుకు. మద్యం మత్తులో ఉన్న పెళ్లి కొడుకుని చూసి, అతడ్ని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది పెళ్లి కూతురు. ఇంకేముంది.. పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రువా జిల్లాలో బుధవారం జరిగింది. రువా జిల్లాలోని నెహ్రూ నగర్కు చెందిన నేహాకు, పీయూష్ మిశ్రాకు పెళ్లి నిశ్చయమైంది. వధువు కుటుంబ సభ్యులు బుధవారం వీళ్ల పెళ్లి జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం పెళ్లి తంతులో భాగంగా వధూవరుల దండలు మార్చే కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో వరుడు తాగి ఉండటాన్ని వధువు నేహా గమనించింది. ఈ సమయంలో వరుడితోపాటు అతడి స్నేహితులు కూడా తాగి ఉన్నారు.
Tajmahal: “తాజ్మహల్ భూభాగం జైపూర్ రాజవంశీయులదే”
అయితే, పెళ్లి రోజే తాగి వచ్చిన వరుడి వ్యవహారశైలిపై వధువు అభ్యంతరం వ్యక్తం చేసింది. తాగొచ్చిన అతడ్ని పెళ్లి చేసుకోనని చెప్పింది. చాలామంది పెద్దలు నేహాకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ, నేహా తన నిర్ణయం మార్చుకోలేదు. చివరకు వధువు నిర్ణయానికి ఆమె కుటుంబ సభ్యులు కూడా మద్దతు తెలిపారు. దీంతో చాలాసేపు చర్చల అనంతరం పెళ్లి రద్దు చేసుకునేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. అయితే, ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. అక్కడ పోలీసుల సమక్షంలో పెళ్లి రద్దుపై ఒప్పందం జరిగింది. పెళ్లికి ముందు వధువు కుటుంబ సభ్యులు ఇచ్చిన నగదు, లాంఛనాలు తిరిగి ఇచ్చేందుకు వరుడి కుటుంబ సభ్యులు అంగీకరించారు. దీంతో పెళ్లి తంతు, శాంతియుతంగా రద్దైంది.
- Madhya pradesh : కరోనాతో కొడుకు మృతి..లక్షలాది రూపాయల విలువైన ఆస్తులిచ్చి కోడలికి మరో వివాహం చేసిన అత్తమామలు
- Andhra Pradesh : జంబలకిడిపంబ-వరుడి మెడలో తాళి కట్టే వధువు
- Groom Shoots Guest: పాటలు పాడాడని గెస్ట్ని కాల్చి చంపిన పెళ్లికొడుకు
- Madhya Pradesh : పవర్ కట్ తెచ్చిన తంటా..తారుమారైన వధూవరులు
- Madhya pradesh : భోపాల్లో రైల్వే కూలీల కోసం ఏసీ రెస్ట్ రూమ్స్
1Anganwadi Posts : విజయనగరం జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీ
2Film Chamber : పైరసీని అరికట్టడంలో ఫిలిం ఛాంబర్ ఫెయిల్ అయింది
3Aurangzeb Tomb:లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు ఔరంగజేబు సమాధి 5రోజుల మూసివేత
43 Dictators : మృత్యువుతో పోరాడుతున్న ప్రపంచంలోని ముగ్గురు నియంతలు..!!
5Pawan kalyan: రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
6Nityananda swamy : నిత్యానందకి ఏమైంది..?తానే దేవుడినని ప్రకటించుకున్న స్వామికి వింత జబ్బు..27 మంది వైద్యులతో చికిత్స..!
7Dr BR Ambedkar : కోనసీమ జిల్లా పేరు..డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పు
8Telangana : గులాబీకి షాక్..కాంగ్రెస్ లో చేరుతున్న టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు..!
9Accident: ఫుట్పాత్ పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..
10Disha Encounter: ‘దిశ’ కమిషన్ నివేదికపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన రేపే..
-
Fuel Prices : 2025నాటికి భారీగా తగ్గనున్న ఇంధన ధర..ఎందుకో తెలుసా?
-
CM Jagan : వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలను ప్రారంభించిన సీఎం జగన్
-
Uttarakhand : కొడుకును పెళ్లి చేసుకున్న మహిళ
-
Darshan Mogulaiah : పద్మశ్రీ అవార్డు బీజేపీ వాళ్లదా..?.. అయితే వాపస్ ఇస్తా : మొగులయ్య
-
CM KCR : నేషనల్ పాలిటిక్స్పై గులాబీ బాస్ ఫోకస్.. రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
-
Gas Cylinder Price : మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..మే నెలలో రెండోసారి పెంపు
-
Modi Telangana Tour : రాజకీయ ఆసక్తి రేపుతున్న ప్రధాని మోదీ తెలంగాణ టూర్
-
Invests In Telangana : తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు