BYJU’S Ravindran : బైజూస్ యజమాని రవీంద్రన్ పై కేసు నమోదు

ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ యజమాని రవీంద్రన్ పై కేసు నమోదు అయింది. యూపీఎస్సీ సిలబస్‌‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించారన్న ఆరోపణలతో అతనిపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

BYJU’S Ravindran : బైజూస్ యజమాని రవీంద్రన్ పై కేసు నమోదు

Byjus Ravindran

BYJUS Ravindran : ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ యజమాని రవీంద్రన్ పై కేసు నమోదు అయింది. యూపీఎస్సీ సిలబస్‌‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించారన్న ఆరోపణలతో  పై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్రిమోఫోబియా సంస్థ చేసిన ఫిర్యాదు ఆధారంగా నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 (ఎ) కింద రవీంద్రన్ పై కేసు నమోదు చేశామని ముంబై పోలీసులు పేర్కొన్నారు.

బైజూస్ కంపెనీ.. యూపీఎస్‌సీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించిందని క్రిమియోఫోబియా వ్యవస్థాపకుడు స్నేహిల్ ధాల్ ఆరోపించారు. యుపీఎస్‌సీ ప్రిపరేటరీ మెటీరియల్‌లో సీబీఐని యుఎన్‌టీఓసీకి నోడల్ ఏజెన్సీగా పేర్కొన్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్నిగమనించిన వెంటనే కంపెనీకి అవసరమైన మార్పులు చేయమని కోరుతూ ఒక ఈ-మెయిల్ పంపినట్లు తెలిపారు. అయితే బైజూస్‌ సమాధానం సంతృప్తికంరంగా లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించారు.

ఎఫ్‌ఐఆర్‌ కాపీని తమ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని బైజూస్‌ రవీంద్రన్ వెల్లడించారు. అలాగే క్రిమియోఫోబియా లేఖను కూడా ధృవీకరించిన సంస్థ తాము అందించిన మెటీరియల్ వాస్తవంగా సరైనదని భావిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి హో మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక కాపీని క్రిమియోఫోబియాకు షేర్ చేసినట్లు తెలిపారు.