Facebook Influencing Polls : దేశ ఎన్నికల్లో ఫేస్ బుక్ జోక్యంపై జేఏపీ విచారణకు కాంగ్రెస్ డిమాండ్

భారతదేశంలో జరిగే ఎన్నికలను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ప్రభావితం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆరోపించింది. భారత ఎన్నికలను ఫేస్​బుక్​ ప్రభావిత

Facebook Influencing Polls : దేశ ఎన్నికల్లో ఫేస్ బుక్ జోక్యంపై జేఏపీ విచారణకు కాంగ్రెస్ డిమాండ్

Congress

Facebook Influencing Polls భారతదేశంలో జరిగే ఎన్నికలను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ప్రభావితం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆరోపించింది. భారత ఎన్నికలను ఫేస్​బుక్​ ప్రభావితం చేస్తోందన్న అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్​ చేసింది.

ఫేస్​బుక్​ తనను తాను ఫేక్​బుక్​గా దిగజార్చుకుందని కాంగ్రెస్​ ప్రతినిధి పవన్​ ఖేరా తెలిపారు. భారత్​లో తమ ఫ్లాట్​ఫామ్​ వేదికగా చేస్తున్న విద్వేషపూరిత ప్రకటనలను అడ్డుకోవటంలో ఫేస్​బుక్​ విఫలమైందన్న పలు అంతర్జాతీయ నివేదికలను ప్రస్తావిస్తూ ఖేరా ఈ వ్యాఖ్యలు చేశారు.

అధికార బీజేపీకి ఫేస్​బుక్​ భాగస్వామ్య వ్యవస్థగా వ్యవహరిస్తూ ఆ పార్టీ అజెండాను ప్రచారం చేస్తోంది. లక్షల సంఖ్యలో పోస్టులతో కూడిన నకిలీ ఖాతాలు ఉన్నట్లు ఫేస్​బుక్​ రీసెర్చ్ డాక్యుమెంట్స్ చెబుతున్నప్పటికీ ఇప్పటికీ వాటిపై సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఫేస్​బుక్​ వ్యవస్థలోకి బీజేపీ కార్యకర్తలు చొరబడి దాని పనితీరునే మార్చేస్తున్నారన్నారు. నకిలీ పోస్టులు, కథనాల ద్వారా ఒక నిర్దిష్ట భావజాలాన్ని ప్రోత్సహించడానికి ఫేస్​బుక్​కు ఏ హక్కు ఉందని ప్రశ్నించారు.

ఢిల్లీ అల్లర్లు బంగాల్​ ఎన్నికల సమయంలో ఫేస్​బుక్​ పనితీరు అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. తమ అజెండాకు అనుగుణంగా నడుచుకుంటున్నందుకే.. ఎన్నికల్లో ఫేస్​బుక్​ జోక్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. అయితే.. ఈ ఆరోపణలపై ఫేస్​బుక్​ ఇండియా ఇప్పటివరకు స్పందించలేదు.

ALSO READ UP Election : యూపీలో కాంగ్రెస్ కు బిగ్ షాక్..టీఎంసీలో చేరిన మాజీ సీఎం మనువళ్లు