Covid Vaccine Booster: నేటి నుంచి కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు: రూ.225కే ఇవ్వాలని కేంద్రం ఆదేశం

18 ఏళ్లు పైబడిన వారందరికి ఆదివారం నుంచి బూస్టర్ డోస్ అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. వ్యాక్సిన్ ధర గరిష్టంగా రూ.225లు

Covid Vaccine Booster: నేటి నుంచి కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు: రూ.225కే ఇవ్వాలని కేంద్రం ఆదేశం

Covid

Covid Vaccine Booster: దేశంలో కరోనా వ్యాప్తి పై మరోమారు వస్తున్న సంకేతాలతో అప్రమత్తమైన కేంద్ర వైద్యారోగ్యశాఖ..నివారణ చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కొత్త వేరియంట్ “XE” బయటపడిన నేపథ్యంలో..మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అందుకనుగుణంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. జూన్ – జులై మధ్య దేశంలో కరోనా నాలుగో దశ గరిష్ట స్థాయికి చేరుకోవచ్చన్న పరిశోధకుల సూచన మేరకు..ప్రభుత్వాలు ముందస్తు కట్టడి చర్యలు ప్రారంభించాయి. అందులో భాగంగా ఏప్రిల్ 10 నుంచి దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ పంపిణీ చేయాలనీ కేంద్రం నిర్ణయించింది. 18 ఏళ్లు పైబడిన వారందరికి ఆదివారం నుంచి బూస్టర్ డోస్ అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. వ్యాక్సిన్ ధరను గరిష్టంగా రూ.225లుగా ఉంచాలని కూడా కేంద్రం ఆదేశించింది.

Also read:Paddy Issue : హస్తినకు గులాబీ దండు.. తెలంగాణ భవన్ వద్ద దీక్ష

ఈనేపధ్యంలో వ్యాక్సిన్ తయారీదారులైన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) మరియు భారత్ బయోటెక్ సంస్థలు తమ వ్యాక్సిన్ ధరలను తగ్గించినట్లు శనివారం ప్రకటించాయి. ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ ధరలను ఒక్కో డోసుకు రూ. 225 మేర తగ్గించారు. సేవా ఛార్జీని ఒక్కో డోస్‌కు గరిష్టంగా రూ.150 లుగా నిర్దేశించారు. మొత్తంగా ఒక్క డోసు వ్యాక్సినేషన్ కొరకు ఎంత వసూలు చేయనున్నారు అనే విషయాన్ని వ్యాక్సిన్ కేంద్రాలు, ఆసుపత్రులు “CoWin” యాప్ లోనూ పొందుపరచాలని కేంద్రం సూచించింది. దేశ వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారు..ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉంటే..వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాల మేరకు వారు బూస్టర్ డోసు తీసుకోవచ్చు. గత రెండు డోసులు ఏదైతే టీకాను తీసుకున్నారో..అదే బ్రాండ్ టీకాను బూస్టర్ డోస్ గా తీసుకోవాల్సి ఉంటుంది.

Also read:Covishield: కొవీషీల్డ్ తీసుకున్న పీజీ విద్యార్థి మృతి.. రూ.10కోట్లు నష్టపరిహారం కోరుతున్న తల్లిదండ్రులు