CWC Meeting : సీడబ్ల్యూసీ మీటింగ్ ఓవర్.. సోనియానే నమ్ముకున్నాం

పార్టీ అధ్యక్షురాలిగా ఆమె కొనసాగుతున్నారని, ఐదు రాష్ట్రాలపై సమగ్ర చర్చ జరిగిందని ఏఐసీసీ గోవా ఇన్ ఛార్జీ దినేష్ తెలిపారు. 2024 లోక్ సభ ఎన్నికలతో పాటు రానున్న ఎన్నికల్లో సవాళ్లను...

CWC Meeting : సీడబ్ల్యూసీ మీటింగ్ ఓవర్.. సోనియానే నమ్ముకున్నాం

Soniya

CWC Meeting Sonia Gandhi : సీడబ్ల్యూసీ మీటింగ్ ముగిసింది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠకు తెరపడింది. సోనియా గాంధీపై తమకు నమ్మకం ఉందని.. ఆమేనే తమకు నాయకత్వం అందిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేతలు వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ పగ్గాలు సోనియా గాంధీ చేతిలోనే ఉన్నాయని స్పష్టమైంది. 2022, మార్చి 13వ తేదీ ఆదివారం సుమారు 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భవిష్యత్ లో చర్యలు తీసుకుంటారని తెలిపారు.

Read More : CWC Meeting : అక్బర్ రోడ్ బ్లాక్.. గాంధీలు రాజీనామా చేయొద్దంటూ నినాదాలు

పార్టీ అధ్యక్షురాలిగా ఆమె కొనసాగుతున్నారని, ఐదు రాష్ట్రాలపై సమగ్ర చర్చ జరిగిందని ఏఐసీసీ గోవా ఇన్ ఛార్జీ దినేష్ తెలిపారు. 2024 లోక్ సభ ఎన్నికలతో పాటు రానున్న ఎన్నికల్లో సవాళ్లను ఎదుర్కొనడానికి పార్టీ సిద్ధంగా ఉందని నేతలు ప్రకటించారు. సోనియాపై విశ్వాసాన్ని ఏకగ్రీవంగా సభ్యులు ప్రకటించారు. ఆమెనే ముందుండి కాంగ్రెస్ ను నడిపించాలని అభ్యర్థించిందని కాంగ్రెస్ పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

Read More : CWC Meeting: ఘోర పరాజయంపై కాంగ్రెస్ లో కల్లోలం

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఓటమిపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆదివారం ఢిల్లీలో భేటి జరిగింది. చివరిసారిగా గత సంవత్సరం అక్టోబర్ 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. మరలా 2022, మార్చి 13వ తేదీ ఆదివారం ఈ సమావేశం జరుగనుంది. సీడబ్ల్యూసీ (CWC) సమావేశానికి 57 మందికి ఆహ్వానం అందింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఘోర పరాజయానికి కారణాలు, భవిష్యత్తు వ్యూహాలు వంటి కీలక అంశాలపై కాంగ్రెస్‌ అగ్రనేతలు చర్చించినట్లు సమాచారం. ఈ కీలక సమావేశానికి గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌శర్మ సహా ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. పార్టీ పదవులకు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గుడ్‌బై చెప్తారని టాక్ గుప్పుమంది. ముగ్గురి రాజీనామా వార్తలను కాంగ్రెస్ అధికారికంగా ఖండించింది.

Read More : CWC Meeting : అసమ్మతి నేతలకు సోనియా స్ట్రాంగ్ వార్నింగ్.. గీత దాటితే వేటు పడినట్లే

జీ 23 గ్రూప్‌ నేతలు.. నాయకత్వ మార్పు కోరుకుంటుంటే గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉండే వారంతా రాజీనామాల అవసరం లేదని చెబుతున్నారు. సమావేశానికంటే ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. యూత్ కాంగ్రెస్ నేతలు భారీగా ఏఐసీసీ కార్యాలయానికి తరలివచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాజీనామా చేయవద్దంటూ నినాదాలు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు అక్బర్ రోడ్డును బ్లాక్ చేశారు. మీటింగ్ అనంతరం సోనియానే కాంగ్రెస్ ను ముందుండి నడిపిస్తారని, ఆమె నాయకత్వంపై నమ్మకం ఉందని నేతలు చెప్పడం గమనార్హం.