Smriti Irani: ‘గాంధీ’ కుటుంబం గురించి మాట్లాడినందుకే నా కూతురిపై ఆరోపణలు: స్మృతి ఇరానీ

స్మృతి ఇరానీ కూతురు జోయిష్ గోవాలో అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై స్మృతి ఇరానీ స్పందించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి తాను మాట్లాడుతున్నందుకే తన కూతురుపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు.

Smriti Irani: ‘గాంధీ’ కుటుంబం గురించి మాట్లాడినందుకే నా కూతురిపై ఆరోపణలు: స్మృతి ఇరానీ

Smriti Irani

Smriti Irani: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నందుకే తన కూతురుపై కాంగ్రెస్ కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. గోవాలో స్మృతి ఇరానీ కూతురు జోయిష్ అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.

Woman Gang-Raped: ఫంక్షన్ కోసం పిలిచి మహిళపై రైల్వే సిబ్బంది అత్యాచారం

మరణించిన ఒక వ్యక్తి పేరుతో లైసెన్స్ పొంది గోవాలో అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు తేలిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ.. స్మృతి ఇరానీని మంత్రి వర్గంలోంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్మృతి ఇరానీ స్పందించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నందుకే తన కూతురుపై ఆరోపణలు చేస్తూ, వివాదాల్లోకి లాగుతున్నారని స్మృతి ఆరోపించారు. ‘‘నా పద్దెనిమిదేళ్ల కూతురు కాలేజీలో చదువుకుంటోంది. ఆమె ఎలాంటి బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహించడం లేదు. ఒకసారి ఆమె పేరు ఉన్నట్లు చెబుతున్న పత్రాలు పరిశీలించండి. అందులో ఆమె పేరు ఎక్కడుంది? ఆర్‌టీఐ ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా నా కూతురుపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు.

Rahul Gandhi: ఎన్డీయే అంటే ‘నో డాటా అవైలబుల్’.. కేంద్రంపై రాహుల్ సెటైర్లు

నా కూతురు రాజకీయ నాయకురాలు కాదు. తనొక సాధారణ విద్యార్థిని. తన వ్యక్తిత్వం దెబ్బతినేలా చేసినందుకు ఇద్దరు కాంగ్రెస్ నేతలే (జైరామ్ రమేష్, పవన్ ఖేర్) బాధ్యులు. ఇద్దరికీ లీగల్ నోటీసులు కూడా పంపుతాను. నా కూతురు చేసిన తప్పు ఒక్కటే… అది ఆమె తల్లి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి మాట్లాడటమే. అవసరమైతే రాహుల్‌ను అమేథీ రమ్మనండి. అక్కడ ప్రజా కోర్టులో తేల్చుకుందాం’’ అని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు.