Dengue Fever : ఏపీ లో పెరుగుతున్న డెంగీ కేసులు… అలర్టైన వైద్య ఆరోగ్య శాఖ

గత కొద్దిరోజులుగా కురుస్తున్న వానలకు ఆంధ్రప్రదేశ్ లో డెంగీ జ్వరాలు విపరీతంగా పెరిగాయి. వీటిలో అధికభాగం విశాఖ జిల్లాలో నమోదయ్యాయి.

Dengue Fever : ఏపీ లో పెరుగుతున్న డెంగీ కేసులు… అలర్టైన వైద్య ఆరోగ్య శాఖ

Dengue fever

Dengue Fever : గత కొద్దిరోజులుగా కురుస్తున్న వానలకు ఆంధ్రప్రదేశ్ లో డెంగీ జ్వరాలు విపరీతంగా పెరిగాయి.వీటిలో అధికభాగం విశాఖ జిల్లాలో నమోదయ్యాయి. గడిచిని 5 నెలల కాలంలో మొత్తం 1388 డెంగీ కేసులు నమోదు కాగా.. అందులో ఆగస్ట్ 23-29 మధ్యలోనే 255 కేసులు ఉన్నాయి. వీటిలో విశాఖ జిల్లాలో 87 కేసులు నమోదయ్యాయి. మలేరియా కేసుల్లోనూ అలాగే ఉంది. వారంలో 48 కేసులు నమోదైతే వాటిలో 36 కేసులు విశాఖ జిల్లాలో నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెపుతున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా కేసులు పెరగటంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మరో పైవు చికెను గున్యా కేసులు కూడా రాష్ట్రంలో వెలుగు చూశాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 25 కేసులు నమోదైనట్లు భీమా అధికారులు తెలిపారు.

ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉంటాయో… అక్కడ డెంగీ దోమలు సంతానోత్పత్తి  చేస్తుంటాయి. ఉదా.. ఇంటి ఆవరణలో కొబ్బరి చిప్పలు, పాత నీళ్ల బాటిళ్లు, టైర్లు, పెంకులు ఇలా రకరకాల వస్తువుల్లో నీళ్లు నిల్వ ఉంటే లార్వా వృద్ధి చెందుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి 4,887 ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉన్నట్లు అధికారులు ఇంటింటి సర్వేలో గుర్తించారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 896 ఉన్నాయి. మరో 7,425 చోట్ల పాత టైర్లు ఉన్న ప్రాంతాలను, 6,992 కొబ్బరి చిప్పలున్న ప్రాంతాలను గుర్తించి వాటిని తొలగించారు.

పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖ ఈ మూడు శాఖలు సమన్వయంతో పని చేస్తేనే జ్వరాల కట్టిడి నియంత్రించ గలము. ఆరోగ్య శాఖ బృందాలు డెంగీ తీవ్రత ఉన్నచోట చర్యలు తీసుకుంటున్నాయి. ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉంచుకోవద్దని చెబుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ అదుపులోనే ఉన్నాయి. త్వరలోనే విశాఖలో డెంగీని అదుపులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెపుతున్నారు.

డెంగీ జ్వరం లక్షణాలు ఇలా ఉంటాయి
డెంగీ జ్వరం ఈడిస్ దోమ కుట్టటం వల్ల వస్తుంది. దోమ కుట్టిన 24 గంటల్లో విపరీతమైన తలనొప్పివస్తుంది. జ్వరం పెరిగే కొద్దీ కళ్లు ఎర్రగామారుతూ ఉంటాయి. అనంతరం కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి.ఒళ్లంతా దద్దుర్లు మొదలై అవి ఎర్రగా మారతాయి. అన్నం తినాలనిపించదు. తిన్నా వాంతులవుతాయి. కాగా…డెంగీ హీమరోజిక్‌ ఫీవర్‌ (డీహెచ్‌ఎఫ్‌) అంటే ఎక్కువ తీవ్రత ఉన్నట్టు లెక్క. ఇక ఇందులో చివరి దశ అంటే డెంగీ షాక్‌ సిండ్రోమ్‌ (డీఎస్‌ఎస్‌ ) అని అంటారు.

డెంగీ వచ్చిన వారికి చికిత్స
డాక్టర్ల సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. సొంత వైద్యం పనికి రాదు.జ్వర తీవ్రతను తగ్గించేందుకు పారాసెటిమాల్ టాబ్లెట్ వేసుకోవాలి..తాజాగా యాంటీ వైరల్ ఇంజక్షన్ లు అందుబాటులోకి వచ్చాయి. రోగికి ఎక్కువగా పాలు, పళ్ళ రసాలు మాత్రమే ఇస్తూ ఉండాలి. రోగి పరిస్ధితిని బట్టి ఐవీ ఫ్లూయడ్స్ ఎక్కించాలి. రోగి వీలైనంత వరకు ఎక్కువ మోతాదులో నీరు తీసుకుంటూ ఉండాలి.

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం డెంగీ పరీక్షలు నిర్వహించే 24 ఆస్పత్రులకు అదనంగా మరో 30 ఆస్పత్రుల్లో డెంగీ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా మునిసిపల్, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల మధ్య సమన్వయం లోపించడంవల్లే కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.