Dhanush : ఈ ఆరోపణలు ఆపకపోతే 10 కోట్ల పరువు నష్టం దావా వేస్తాను.. ధనుష్ వార్నింగ్..

ధనుష్ కస్తూరి రాజా, విజయలక్ష్మి దంపతుల రెండో కొడుకు. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే ధనుష్ తమ కొడుకే అంటూ గత నాలుగేళ్లుగా కదిరేషన్‌, మీనాక్షి అనే దంపతులు ఆరోపణలు చేస్తూ...................

Dhanush : ఈ ఆరోపణలు ఆపకపోతే 10 కోట్ల పరువు నష్టం దావా వేస్తాను.. ధనుష్ వార్నింగ్..

Dhanush

Dhanush :  తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే కొంతకాలం కిందట ఐశ్వర్య రజినీకాంత్ తో విడిపోయారు. ధనుష్ కస్తూరి రాజా, విజయలక్ష్మి దంపతుల రెండో కొడుకు. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే ధనుష్ తమ కొడుకే అంటూ గత నాలుగేళ్లుగా కదిరేషన్‌, మీనాక్షి అనే దంపతులు ఆరోపణలు చేస్తూ పోలీసులు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలోనే కోర్టు ఓ సారి విచారించి ధనుష్ మీ కొడుకు కాదు అని తీర్పు ఇచ్చింది.

 

Salman Khan : వెంకటేష్ బాలీవుడ్ సినిమా.. డైరెక్టర్‌గా సల్మాన్ ఖాన్..

దీంతో కదిరేషన్‌, మీనాక్షి దంపతులు మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ధనుష్ కి ఇటీవల లీగల్ నోటీసు పంపింది. డబ్బుల కోసం, పేరు కోసం వీళ్ళు ఇలా చేస్తున్నారని ధనుష్ గతంలోనే తెలిపాడు. నాలుగేళ్లుగా ఈ వ్యవహారంతో విసిగిపోయిన ధనుష్ తాజాగా ఆ దంపతులిద్దరికీ లీగల్ నోటీసులు పంపించాడు. ఇందులో తన పేరుప్రఖ్యాతులకు భంగం కలిగించే చర్యలు ఆపాలని, నాలుగేళ్లుగా చేస్తున్న ఆరోపణలన్నీ ఆపేసి అవాస్తవాలని చెబుతూ క్షమాపణ కోరాలని లేకపోతే పదికోట్ల రూపాయల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి ఉంటుందని ధనుష్‌ సీరియస్ గానే రిప్లై తెలిపారు. దీంతో ఈ వ్యవహారం ఇక్కడితో ముగుస్తోందా లేదా చూడాలి.