F3: ఆడియెన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎఫ్3..?

ప్రస్తుతం టాలీవుడ్‌లో సీక్వెల్ చిత్రాల జోరు నడుస్తోంది. ఇప్పటికే బాహుబలి చిత్రం మొదలుకొని, ఇటీవల రిలీజ్ అయిన కేజీయఫ్ చాప్టర్ 2 చిత్రం వరకు, సీక్వెల్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్...

F3: ఆడియెన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎఫ్3..?

F3 Movie To Release Without Any Ticket Price Hike

F3: ప్రస్తుతం టాలీవుడ్‌లో సీక్వెల్ చిత్రాల జోరు నడుస్తోంది. ఇప్పటికే బాహుబలి చిత్రం మొదలుకొని, ఇటీవల రిలీజ్ అయిన కేజీయఫ్ చాప్టర్ 2 చిత్రం వరకు, సీక్వెల్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతూ వచ్చాయి. దీంతో ఒక సినిమాకు సీక్వెల్ రాబోతుందంటే, ఆ సినిమాపై ఆటోమేటిక్‌గా అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సీక్వెల్ చిత్రాల్లో ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్‌ను దక్కించుకుంది ఎఫ్3 మూవీ. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

F3: ‘ఎఫ్3’ కథ ఈ బ్యూటీ చుట్టూ తిరుగుతుందట!

గతంలో వచ్చిన ఎఫ్2 సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు దాని సీక్వెల్ అయిన ‘ఎఫ్3’పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియెన్స్ ఆతృతగా ఉన్నారు. అయితే ఈ సినిమాను వేసవి కానుకగా మే 27న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ఆడియెన్స్‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

F3 Movie: ఆరో భూతం మనీ.. సమ్మర్ హీట్‌లో ఫన్ ట్రీట్ ‘ఎఫ్3’

కరోనా ప్రభావం తరువాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏదైనా బడా సినిమా రిలీజ్ అయితే, ఖచ్చితంగా టికెట్ రేట్లు పెంచుతున్నారు. దీంతో కామన్ ఆడియెన్స్ థియేటర్లకు వెళ్లేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అయితే తమ సినిమాపై పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్న ఎఫ్3 చిత్ర యూనిట్, తమ సినిమాకు ఎలాంటి టికెట్ రేట్ల పెంపు లేకుండానే థియేటర్లలో ల్యాండ్ అవ్వాలని చూస్తున్నారు. ఇలా అయితే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తమ సినిమాను ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, టికెట్ రేట్ల పెంపు లేకుండా రాబోతున్న తొలి సినిమాగా ఎఫ్3 నిలుస్తుంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ త్వరలోనే ఓ అనౌన్స్‌మెంట్ చేస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.