RRR : ఫ్యాన్స్ ఆగ్రహం.. విజయవాడలో థియేటర్ ధ్వంసం..

దేశ వ్యాప్తంగా అందరూ ఎదురు చూసిన 'ఆర్ఆర్ఆర్' సినిమా నిన్న రిలీజ్ అయింది. అభిమానులు దాదాపు మూడు సంవత్సరాలుగా తమ హీరోలని తెరపైన చూడలేదు. దీంతో ఎంతో ఆశగా థియేటర్ కి వెళ్లారు..........

RRR : ఫ్యాన్స్ ఆగ్రహం.. విజయవాడలో థియేటర్ ధ్వంసం..

Theater

RRR :  నిన్న దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. దర్శక ధీరుడు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి అద్భుతం సృష్టించారు. బెనిఫిట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది ‘ఆర్ఆర్ఆర్’. సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు, సెలబ్రిటీలు సినిమాపై, రాజమౌళి, తారక్, చెర్రీలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల అభిమానుల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఇద్దరు స్టార్ హీరోలుండటంతో కొన్ని విషయాల్లో థియేటర్స్ వద్ద గొడవలు జరిగాయి.

అంతే కాక అభిమానులు ఎంతో ఆశగా తమ అభిమాన హీరో సినిమాని మొదటి రోజు చూడాలని అనుకుంటారు. టికెట్ రేట్లు ఎక్కువైనా సరే మొదటి రోజు సినిమా చూస్తారు అభిమానులు. ఎంతో ఆశగా తమ హీరోని తెరపై చూడాలనుకున్న వారికి థియేటర్ సాంకేతికలోపంతో సినిమా ఆగిపోతే ఆగ్రహావేశాలు రావడం ఖాయం. గతంలో కూడా కొన్ని సంఘటనల్లో రిలీజ్ రోజు సాంకేతిక సమస్యలు ఏర్పడి సినిమా ఆగిపోతే అభిమానులు ఆగ్రహించి థియేటర్లని ధ్వంసం చేసిన ఘటనలు ఉన్నాయి. ఇక స్టార్ హీరోల సినిమాలకి ఇలా జరిగితే అంతే సంగతులు.

RRR : ప్రేక్షకులకు, అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ఎన్టీఆర్

దేశ వ్యాప్తంగా అందరూ ఎదురు చూసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిన్న రిలీజ్ అయింది. అభిమానులు దాదాపు మూడు సంవత్సరాలుగా తమ హీరోలని తెరపైన చూడలేదు. దీంతో ఎంతో ఆశగా థియేటర్ కి వెళ్లారు. అయితే విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రప్రదర్శన సమయంలో సాంకేతిక లోపం తలెత్తి సినిమా ఆగిపోయింది. దీంతో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆగ్రహాన్ని థియేటర్ పై చూపించారు. థియేటర్లోని కుర్చీలు, బయట ఫర్నిచర్, థియేటర్ అద్దాలు పగలగొట్టారు అభిమానులు. దీంతో థియేటర్ యాజమాన్యానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు వచ్చి థియేటర్ ని పరిశీలించి, కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.