మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

Road Accident

road accident Four killed : మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్‌ మండలం గుడిగండ్ల సమీపంలో ప్రయాణిస్తోన్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.



మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కారులో ఉన్న మూడేళ్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.



అతి వేగంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. వీరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.