Airbus : 56 విమానాల కొనుగోలు కోసం..ఎయిర్‌బస్ తో కేంద్రం మెగా డీల్

  స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్‌తో భారత రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం భారీ ఒప్పందం కుదుర్చుకుంది. భారత వాయుసేన రవాణా వ్యవస్థ బలోపేతం కోసం

Airbus : 56 విమానాల కొనుగోలు కోసం..ఎయిర్‌బస్ తో కేంద్రం మెగా డీల్

Airbus

Airbus  స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్‌తో భారత రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం భారీ ఒప్పందం కుదుర్చుకుంది. భారత వాయుసేన రవాణా వ్యవస్థ బలోపేతం కోసం సుమారు రూ.20,000 కోట్లతో… 56 C-295 MW మిలటరీ రవాణా విమానాలను కొనుగోలు చేయడానికి ఎయిర్‌బస్ తో కాంట్రాక్టుపై సంతకాలు పూర్తయ్యాయని రక్షణ శాఖ ప్రతినిధి ఏ భరత్​ భూషణ్​ బాబు తెలిపారు.

కాగా,సుదీర్ఘం కాలంగా పెండింగ్​లో ఉన్న ఈ విమానాల కొనుగోలుకు రెండు వారాల క్రితమే ద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. C-295 ఎండబ్ల్యూ విమానం..5-10 టన్నుల సరుకును రవాణా చేయగలదు. ఈ విమానాలు.. ప్రస్తుతం వాయుసేనలో సేవలందిస్తున్న అవ్రో-748 విమానాలను భర్తీ చేయనున్నాయి. అవ్రో-748 విమానాలను మార్చాలనే నిర్ణయం తొమ్మిదేళ్ళ క్రితం జరిగింది.

ఒప్పందంలో భాగంగా 48 నెలల్లోగా 16 రవాణా విమానాలను భారత్​కు అందించనుంది ఎయిర్​ బస్​ డిఫెన్స్​. మిగిలిన 40 విమానాలను మన దేశంలోనే తయారు చేస్తారు. ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కన్సార్షియం ఈ 40 ఎయిర్​క్రాఫ్ట్స్​ను తయారు చేస్తుంది. వీటిని ఈ ఒప్పందంపై సంతకాలు జరిగినప్పటి నుంచి పదేళ్ళలో తయారు చేసి, అందజేస్తాయి. సైనిక విమానాలను భారతదేశంలో ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేసే తొలి ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం.

ఈ సందర్భంగా భారత రక్షణ శాఖకు, ఎయిర్​ బస్​కు శుభాకాంక్షలు తెలిపారు టాటా ట్రస్ట్​ ఛైర్మన్​ రతన్​ టాటా. సీ-295 రవాణా విమానాల తయారీకి టాటా అడ్వాన్సుడ్​ సిస్టమ్స్​, ఎయిర్​బస్​ డిఫెన్స్​ జాయింట్​ ప్రాజెక్టుకు ఆమోదం లభించటం భారత్​లో వైమానిక ప్రాజెక్టుల ప్రారంభానికి గొప్ప ముందడుగుగా పేర్కొన్నారు ​ రతన్​ టాటా. ఇది భారత్​లో పూర్తిస్థాయిలో విమానాల తయారీని బలోపేతం చేస్తుందన్నారు. గతంలో ఎన్నడూ చేయని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో దేశీయ సరఫరా సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు.

READ UP Election 2022 : అప్నాదళ్, నిషాద్ పార్టీలతో పొత్తు ప్రకటించిన బీజేపీ