Hardik Pandya: టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్‌కు చోటు

Hardik Pandya: టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్‌కు చోటు

Hardik Pandya

Hardik Pandya: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా రాణించిన హార్దిక్ పాండ్యాకు టీమిండియా కెప్టెన్సీ దక్కింది. మరికొద్ది రోజుల్లో ఐర్లాండ్ తో జరిగే రెండు టీ20ల మ్యాచ్‌లకు హార్దిక్ కెప్టెన్‌గా, భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్ గా సెలక్ట్ చేసింది సెలక్షన్ కమిటీ. జట్టులో తొలి సారి సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ లకు చోటు దక్కగా రాహుల్ త్రిపాఠీలు కూడా చోటు కల్పించారు.

పొరుగుదేశమైన ఇంగ్లాండ్ కు వెళ్లి టీమిండియా రెండు టీ20లు ఆడనుంది. దురదృష్టవశాత్తు కేఎల్ రాహుల్ ఇంకా రికవరీ కాకపోవడంతో జట్టులోకి ఎంట్రీ దక్కలేదు.

దక్షిణాఫ్రికాతో సిరీస్ తర్వాత రిషబ్ పంత్ టెస్టు ఫార్మాట్ లోకి వెళ్తుండటంతో టీ20లో కెప్టెన్ స్థానాన్ని పాండ్యా భర్తీ చేయనున్నాడు. పంత్ మినహాయించి అందరూ గురువారానికంటే ముందే జులై 1నుంచి 5వరకూ జరగనున్న సిరీస్ నిమిత్తం ఇంగ్లాండ్ వెళ్లనున్నారు.

Read ALso: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

టీమిండియా: హార్దిక్ పాండ్యా (సి), భువనేశ్వర్ కుమార్ (విసి), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్), యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, ఆర్ బిష్ణోయ్ , హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్