Pawan Kalyan : హరిహర వీరమల్లు ఏమైంది?? షూటింగ్ ఎప్పుడు??

హరిహర వీరమల్లు ఆగిపోయిందా అని పవన్ ఫ్యాన్సే కాదు, ఆడియన్స్ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాల తర్వాత.............

Pawan Kalyan : హరిహర వీరమల్లు ఏమైంది?? షూటింగ్ ఎప్పుడు??

Harihara Veeramallu

Pawan Kalyan :  బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో, పొలిటికల్ మీటింగ్స్ తో పవర్ స్టార్ ఫుల్ బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు కోసం భారీ సెట్ నిర్మించినా షూట్ మాత్రం అనుకున్న టైమ్ కి జరగలేదు. దాంతో ఆ సినిమా ఆల్మోస్ట్ ఆగిపోయిందని, ఆ సినిమా రషెస్ పైన పవన్ అసతృప్తిగా ఉన్నారని, ప్రొడ్యూసర్ కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇంతకీ హరిహర వీరమల్లు ఆగిపోయిందా? లేదా?

హరిహర వీరమల్లు ఆగిపోయిందా అని పవన్ ఫ్యాన్సే కాదు, ఆడియన్స్ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాల తర్వాత క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఏఎం రత్నం ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ 50 పర్సెంట్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా మే ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఫ్లాన్ చేశారు. అయితే హైదరాబాద్ లో ఈ సినిమాకోసం భారీ సెట్ నే నిర్మించారు. కాని, డేట్స్ అడ్జెస్ట్ కాక ఆ సినిమా షూటింగ్ కి అంతరాయం కలగడంతో సోషల్ మీడియాలో ఈ సినిమానే ఆగిపోయింది అన్న న్యూస్ హల్చల్ చేసింది.

భారీ సెట్ నిర్మాణం జరిగినా షూటింగ్ జాప్యం కావడంతో ప్రొడ్యూసర్ కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పెరిగిపోయాయని అందుకే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని రూమర్ వచ్చింది. ఇంకా క్రిష్ ఇప్పటివరకు చేసిన షూటింగ్ లోనూ రష్ పరిశీలించిన పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఫీలయ్యారని మరో రూమర్ కూడా వచ్చింది. అయితే ఈ రూమర్స్ ని ఖండిస్తూ జూన్ 7 నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని ప్రకటించి, హరిహర వీరమల్లు పైన ఉన్న అనుమానాలను పటాపంచలు చేశారు సినిమా మేకర్స్.

Raviteja : రామారావు ఆన్ డ్యూటీ.. వాయిదాల మీద వాయిదాలు.. హీరో, నిర్మాత మధ్య గొడవ??

పాన్ ఇండియా రేంజ్ లో పవన్ కళ్యాణ్ ను బంధిపోటు క్యారెక్టర్ లో చూపించబోతున్న హరిహర వీరమల్లు ఫస్ట్ గ్లింప్స్ తోనే ఈ సినిమాపైన భారీ అంచనాలు పెంచేశారు క్రిష్. వరసగా రెండు ఫ్లాపులతో ఉన్న క్రిష్ ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ కొట్టాలని కసిగా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. మరో కీలక పాత్రలో నోరా ఫతేహి నటిస్తుండగా, విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ మొఘల్ చక్రవర్తిగా నటించనున్నట్టు తెలుస్తో్ంది. జూన్ 7 నుంచి జరగబోయే షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని టీమ్ నుంచి అందుతున్న సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.