DVAC Raids : మాజీ మంత్రి ఇంటిపై ఏసీబీ దాడులు, విదేశీ కరెన్సీ, 4.9 కిలోల బంగారం స్వాధీనం!
అన్నాడీఎంకే ముఖ్యనేత, మాజీ మంత్రి కేసీ వీరమణి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడినట్లు సమాచారం.
Minister Veeramani House : అన్నాడీఎంకే ముఖ్యనేత, మాజీ మంత్రి కేసీ వీరమణి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడినట్లు సమాచారం. బెంగళూరుతో పాటు 35 ప్రాంతాల్లో 2021, సెప్టెంబర్ 17వ తేదీ శుక్రవారం అకస్మికంగా తనిఖీలు జరిపారు. 34 లక్షలు, 1.8 లక్షల విదేశీ కరెన్సీని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Read More : Petrol And Diesel Price : పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు
అంతేగాకుండా…4.9 కిలోల బంగారం, 47 గ్రాముల డైమండ్స్, 7.2 కిలోల వెండితో పాటు ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో కలకలం సృష్టించింది. అన్నాడీఎంకే ప్రభుత్వ హాయాంలో వీరమణి కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారని తెలుస్తోంది. ఆయన ఇళ్లు, ఆఫీసు, బంధువుల ఇళ్లలపై తనిఖీలు నిర్వహించారు. కోట్ల విలువైన ఆస్తిపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
US dollars,Jewellery and cars seized during the searches at properties related to former minister #Veeramani. Searches were conducted in 35 locations including in Bangalore.
34 lakhs,$ worth 1.08 lakhs,9 cars including rolls Royce,4.9kg Gold, 47 gram of diamonds,7.2kg silver. pic.twitter.com/IXdg1wD4PW
— Mugilan Chandrakumar (@Mugilan__C) September 16, 2021