India vs England: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో కనపడి ఆశ్చర్యపర్చిన ధోనీ
భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తాజాగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో కనపడి అందరినీ ఆశ్చర్యపర్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్విటర్లో పోస్ట్ చేశాయి.
India vs England: భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తాజాగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో కనపడి అందరినీ ఆశ్చర్యపర్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్విటర్లో పోస్ట్ చేశాయి. ”ధోనీ ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది” అని బీసీసీఐ పేర్కొంది. యువ క్రికెటర్లతో ధోనీ టచ్లో ఉంటున్నాడంటూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెప్పింది.
Gardening: తోటపని చేస్తే మానసిక ఆరోగ్యం
ఇషాంత్ కిషన్తో మహేంద్ర సింగ్ ధోనీ కొద్దిసేపు మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా, ఇంగ్లండ్లో రెండో టీ20 ముగిసిన అనంతరం ధోనీ ఇలా డ్రెస్సింగ్ రూమ్లో కనపడ్డాడు. మొదటి రెండు టీ20ల్లో భారత జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడో మ్యాచులోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని జట్టు భావిస్తోంది. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.