India vs West Indies: అర్ధ సెంచ‌రీలు బాదిన ధావ‌న్‌, శుభ్‌మ‌న్

ప్ర‌స్తుతం శుభ్‌మ‌న్ గిల్ 51, శ్రేయాస్ అయ్య‌ర్ 2 ప‌రుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు ఒక వికెట్ న‌ష్టానికి 115 ప‌రుగులుగా ఉంది. అయితే. 24వ‌ ఓవ‌ర్ ముగిశాక వ‌ర్షం ప‌డ‌డంతో ఆట‌కు బ్రేక్ ఇచ్చారు. మ‌ళ్ళీ వ‌ర్షం త‌గ్గితే ఆడే అవ‌కాశం ఉంది.

India vs West Indies: అర్ధ సెంచ‌రీలు బాదిన ధావ‌న్‌, శుభ్‌మ‌న్

Rain In Ground

India vs West Indies: వెస్టిండీస్‌తో జ‌రుగుతోన్న మూడో వ‌న్డేలో టీమిండియా ఓపెన‌ర్లు శిఖ‌ర్ ధావ‌న్‌, శుభ్‌మ‌న్ గిల్ అర్ధ సెంచ‌రీల‌తో అద‌ర‌గొట్టారు. భార‌త్-వెస్టిండీస్ మ‌ధ్య ట్రినిడాడ్‌లో జ‌రుగుతోన్న‌ మూడో వ‌న్డేలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకున్న విష‌యం తెలిసిందే. ఓపెన‌ర్‌గా క్రీజులోకి వ‌చ్చిన శిఖ‌ర్ ధావన్ 74 బంతుల్లో 58 ప‌రుగులు చేసి వాల్ష్ బౌలింగ్‌లో నికోల‌స్‌ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు.

ప్ర‌స్తుతం శుభ్‌మ‌న్ గిల్ 51, శ్రేయాస్ అయ్య‌ర్ 2 ప‌రుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు ఒక వికెట్ న‌ష్టానికి 115 ప‌రుగులుగా ఉంది. అయితే. 24వ‌ ఓవ‌ర్ ముగిశాక వ‌ర్షం ప‌డ‌డంతో ఆట‌కు బ్రేక్ ఇచ్చారు. మ‌ళ్ళీ వ‌ర్షం త‌గ్గితే ఆడే అవ‌కాశం ఉంది. వెస్టిండీస్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌లో టీమిండియా ఇప్ప‌టికే 2 మ్యాచులు గెలిచిన విష‌యం తెలిసిందే. నేటి వ‌న్డేలోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాల‌ని భావిస్తోంది.

BSNL: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు ప్రత్యేక ప్యాకేజీ