IndVsEng 3rd ODI : పంత్ వీరోచిత సెంచరీ.. మూడో వన్డేలో ఇంగ్లండ్పై భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం
ఇంగ్లండ్ తో సిరీస్ ను డిసైడ్ చేసే మూడో వన్డే మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఇంగ్లండ్ పై ఘన విజయం సాధించింది. పంత్ వీరోచిత సెంచరీతో చెలరేగాడు.(IndVsEng 3rd ODI)
IndVsEng 3rd ODI : ఇంగ్లండ్ తో సిరీస్ ను డిసైడ్ చేసే మూడో వన్డే మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఇంగ్లండ్ పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
260 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. మరో 47 బంతులు, 5 వికెట్లు మిగిలి ఉండగానే టార్గెట్ చేజ్ చేసింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా పంత్ వీరోచిత సెంచరీతో చెలరేగాడు. పంత్ 113 బంతుల్లోనే 125 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడి స్కోర్ లో 16 ఫోర్లు 2 సిక్సులు ఉన్నాయి.(IndVsEng 3rd ODI)
England vs India: మూడో వన్డేలో రవీంద్ర జడేజా పట్టిన క్యాచ్ వీడియో వైరల్
హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో మెరిశాడు. పాండ్యా 55 బంతుల్లో 71 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 10 ఫోర్లు ఉన్నాయి. వీరిద్దరూ భారత్ ను విజయతీరాలకు చేర్చారు. 42.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది భారత్. ఈ గెలుపుతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
పంత్, పాండ్యా జోడీ ఐదో వికెట్కు 115 బంతుల్లో 133 పరుగులు జోడించి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేసింది. 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును వీరిద్దరూ ఆదుకున్నారు. మొదట ఆచితూచి ఆడగా.. తర్వాత క్రీజులో కుదురుకున్నాక ఇంగ్లండ్ బౌలర్లపై చెలరేగిపోయారు. అయితే, కీలక సమయంలో పాండ్యా ఔటైనా.. జడేజా (7)తో కలిసి పంత్ భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు.
T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్లో ఆడనున్న పూర్తి జట్లు ఇవే
.@RishabhPant17 played a fantastic match-winning knock and was our top performer from the second innings of the third #ENGvIND ODI. ? ? #TeamIndia
A summary of his knock ? pic.twitter.com/8YqskQkWH7
— BCCI (@BCCI) July 17, 2022
260 పరుగుల లక్ష్యఛేదనలో ఓ దశలో టీమిండియా టాపార్డర్ చేతులెత్తేసినా వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ రిషబ్ పంత్.. హార్దిక్ పాండ్యాతో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. పిచ్ బ్యాటింగ్ కు ఏమాత్రం సహకరించకపోయినా, ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా పని ముగించాడు. చివర్లో డేవిడ్ విల్లీ విసిరిన ఓవర్లో పంత్ వరుసగా 5 ఫోర్లు కొట్టడం హైలైట్.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగారు. హార్దిక్ పాండ్యా (4/24), యుజ్వేంద్ర చాహల్ (3/60) ఇంగ్లీష్ జట్టును భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. బట్లర్ 80 బంతుల్లో 60 పరుగులు చేశాడు.
Brilliant run chase and a great series win. ??? pic.twitter.com/Mcu2KSxct6
— Virat Kohli (@imVkohli) July 17, 2022
ఓపెనర్ జేసన్ రాయ్ 31 బంతుల్లో 41 పరుగులు చేశాడు. జట్టులో రెండో టాప్ స్కోరర్గా నిలిచాడు. చివర్లో క్రేగ్ ఓవర్టన్ (33 బంతుల్లో 32 పరుగులు), డేవిడ్ విల్లే (15 బంతుల్లో 18 పరుగులు) ఎనిమిదో వికెట్కు కీలకమైన 48 పరుగుల భాగస్వామ్యం జోడించారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 4 వికెట్లు తీశాడు. యజువేంద్ర చాహల్ మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ రెండు వికెట్లు తీయగా, జడేజా ఒక వికెట్ తీశాడు.(IndVsEng 3rd ODI)
A memorable #ENGvIND tour for #TeamIndia as we finish it on a winning note. ? ? pic.twitter.com/cxPLXpoBvh
— BCCI (@BCCI) July 17, 2022
వీరోచిత సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చిన పంత్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఈ సిరీస్ లో అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో అదరగొట్టిన హార్దిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కైవసం చేసుకున్నాడు.