Ram Charan: చరణ్తో సినిమాపై లోకేశ్ క్లారిటీ!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా....
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో చరణ్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాలో చరణ్ సరికొత్త లుక్లో కనిపిస్తున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ సినిమా తరువాత చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్టులను కూడా ఓకే చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కూడా ఉన్నాడని ఇటీవల వార్తలు వినిపించాయి.
Ram Charan: బాలీవుడ్లో చరణ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా..?
తాజాగా ఈ వార్తలపై దర్శకుడు లోకేశ్ స్పందించినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రీసెంట్గా విక్రమ్ చిత్రంతో బాక్సాఫీస్ను షేక్ చేసిన ఈ యంగ్ డైరెక్టర్, గతంలో చరణ్ను పలుమార్లు కలిసాడట. అయితే చరణ్తో ఉన్న స్నేహం కారణంగా మాత్రమే ఆయన్ను కలిసినట్లుగా లోకేశ్ వెల్లడించాడు. ఇక చరణ్కు తాను ఎలాంటి కథలు వినిపించలేదని తెలిపారు. దీంతో చరణ్-లోకేశ్ కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన వార్తలకు ఫుల్స్టాప్ పడినట్లు అయ్యింది.
Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్కే చరణ్ ఓటు..?
కాగా.. లోకేశ్ తన నెక్ట్స్ మూవీ కోసం మరికొంత సమయం తీసుకుంటాడని తెలుస్తోంది. ఇక చరణ్ తన తాజా చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాను పొలిటికల్ థ్రిల్లర్ చిత్రంగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.