MAA Elections 2021 : ‘మా’ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

ఇవాళ ఉదయం ప్రారంభమైన 'మా' ఎన్నికలు కొద్ది సేపు ప్రశాంతంగా జరిగాయి. తాజాగా ఇప్పుడు ఇరు ప్యానళ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

MAA Elections 2021 :  ‘మా’ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

Maa (1)

MAA Elections 2021 :  మొన్నటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా గొడవలకి దిగుతున్నారు. ఇవాళ ఉదయం ప్రారంభమైన ‘మా’ ఎన్నికలు కొద్ది సేపు ప్రశాంతంగా జరిగాయి. తాజాగా ఇప్పుడు ఇరు ప్యానళ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లోపల ప్రచారం చేస్తున్నారు అంటూ ఒకరిపై ఒకరు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. తర్వాత బయట ప్రచారం చేస్తుంటే ఇంకా బయటకి వెళ్ళండి అనడంతో పోలీసులపై సీరియస్ అయ్యారు కరాటే కళ్యాణి. శివ బాలాజీ, సమీర్ ప్రచారం విషయంలో గొడవ పడి ఒకరి పై ఒకరు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసుకున్నారు.

Pawan Kalyan : ‘మా’ ఎన్నికల కోసం ఇంత హడావిడి చేసి ఉండాల్సింది కాదు : పవన్ కళ్యాణ్

ఆ తర్వాత బయటి వాళ్ళు వచ్చి ఓటేస్తున్నారని కాసేపు గొడవ చేసారు. నరేష్ మీదకి బయటి వ్యక్తులు వచ్చారని తోసేశారని అనడంతో ఈ విషయమై ప్రకాష్ రాజ్ కి నరేష్ కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకర్నొకరు తోసుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తోసుకున్నారు. మళ్ళీ వెంటనే మంచు విష్ణుతో కలిసి ప్రకాష్ రాజ్ బయటకి వచ్చి సరదాగా మీడియాతో మాట్లాడారు. రిగ్గింగ్ కూడా జరుగుతుంది అని అనుమానాలు వ్యక్తం చేయడంతో ఎన్నికల అధికారి సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు.