Parasuram: మహేశ్ దర్శకుడి భారీ స్కెచ్.. ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్!

డైరెక్టర్ పరుశురాం కెరీర్ లో తొలిసారి చేస్తున్న భారీ ప్రాజెక్ట్ సర్కారు వారి పాట. ఇంతకు ముందు ఆంజనేయులు సినిమాతో రవితేజ లాంటి స్టార్ హీరోతో పనిచేసిన అనుభవం ఉన్న పరుశురాం..

Parasuram: మహేశ్ దర్శకుడి భారీ స్కెచ్.. ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్!

Parasuram

Parasuram: డైరెక్టర్ పరుశురాం కెరీర్ లో తొలిసారి చేస్తున్న భారీ ప్రాజెక్ట్ సర్కారు వారి పాట. ఇంతకు ముందు ఆంజనేయులు సినిమాతో రవితేజ లాంటి స్టార్ హీరోతో పనిచేసిన అనుభవం ఉన్న పరుశురాం గీత గోవిందం సినిమా తెచ్చిన గ్రాండ్ సక్సెస్ తో మహేశ్ బాబు లాంటి స్టార్ హీరో అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట చివరి దశలో ఉండగా ఈ సినిమా రిజల్ట్ పరుశురాం కెరీర్ ను డిసైడ్ చేయనుంది. సర్కారు వారి పాట సక్సెస్ అయితే పరుశురాం టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్ చేయనున్నాడు.

Pushpa: తగ్గేదేలే.. రూ.100 కోట్ల వైపు పుష్ప బాలీవుడ్ కలెక్షన్లు!

పరుశురాం వద్ద ప్రస్తుతం ఓ మల్టీస్టారర్ కథ ఉందట. ఇందులో ముగ్గురు హీరోలు నటించాలట. ముగ్గురూ స్టార్ హీరోలైతే ఈ సినిమాకు భారీ క్రేజ్ వస్తుందని పరుశురాం చెప్తున్నాడు. సర్కారు వారి పాట సినిమా తర్వాత ఈ కథను డెవలప్ చేస్తానని చెప్పాడు. సర్కారు వారి పాట సినిమా సక్సెస్ అయితే ఈ మల్టీస్టారర్ లో నటించేందుకు స్టార్ హీరోలు ఒకే చెప్పడం సులభం అవుతుంది. నిజానికి సోలో లాంటి సినిమాలతో పరుశురాం టేకింగ్ మీద హీరోలకు చాలా నమ్మకం ఉంది. అయితే నిర్మాతలు భారీ బడ్జెట్ పెట్టాలంటే కమర్షియల్ సక్సెస్ కావాలి.

ManiRathnam : సిద్ శ్రీరామ్ హీరోగా మణిరత్నం సినిమా??

సర్కారు వారి పాట సక్సెస్ కొట్టి రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తే తర్వాత మల్టీస్టారర్ సినిమాకు నిర్మాతలు భారీ బడ్జెట్ పెట్టడం కష్టమేమీ కాదు. అందుకే ఇప్పుడు మహేశ్ సినిమా ఫలితం పరుశురాం కెరీర్ ను డిసైడ్ చేయనుంది. కాగా.. పరుశురాం ఈ క్రేజీ మల్టీస్టారర్ గురించి చెప్పడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ అవుతుంది. అయితే.. అసలు సబ్జెక్టు ఏంటి.. కథ ఏంటన్నది మాత్రం పరుశురాం లీక్ చేయలేదు. మరి ఈ కథ ఏంటో.. హీరోలు ఎవరో.. ఈ సినిమా పట్టాలేక్కెదేప్పుడో చూడాలి.