Bengaluru: మహిళపై యాసిడ్ దాడి చేసిన తోటి ఉద్యోగి
ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని, ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. అయితే, ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు తోటి ఉద్యోగి. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.
Bengaluru: ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని, ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. అయితే, ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు తోటి ఉద్యోగి. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే, అతడిని ఆ మహిళ నిరాకరించడంతో ఆ మృగాడు యాసిడ్తో దాడి చేశాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని సరాక్కి ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. తోటి ఉద్యోగి చేతిలో యాసిడ్ దాడికి గురైన ఆ మహిళ (32) కుడి కంటికి గాయమైందని పోలీసులు చెప్పారు.
prophet row: అసలు ఆందోళనలో పాల్గొన్నది ఎవరో నాకు తెలియదు: జామా మసీదు షాహీ ఇమామ్
దీంతో ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, ఆమె కంటికి వైద్యులు చికిత్స చేశారని పోలీసులు తెలిపారు. ఆమె త్వరలోనే కోలుకుని, డిశ్చార్జ్ అవుతుందని అన్నారు. ఆమెపై యాసిడ్ దాడి చేసిన నిందితుడు అహ్మద్ (36) పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వివరించారు. ఆ మహిళ, అహ్మద్ మూడేళ్లుగా ఒకే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని చెప్పారు. ఆ మహిళను పెళ్లి చేసుకుంటానని కొన్ని వారాలుగా ఆమెపై అహ్మద్ ఒత్తిడి తీసుకొస్తున్నాడని వివరించారు.