Mani Ratnam : దర్శకుడు మణిరత్నంకు కోవిడ్ పాజిటివ్.. హాస్పిటల్ లో చేరిక..

రెండు రోజుల క్రితమే నటి వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారిన పడ్డానని తెలిపింది. తాజాగా దర్శకుడు మణిరత్నం కరోనా బారిన పడ్డారు. ఇటీవల జులై 8న మణిరత్నం................

Mani Ratnam : దర్శకుడు మణిరత్నంకు కోవిడ్ పాజిటివ్.. హాస్పిటల్ లో చేరిక..

Mani Ratnam

Mani Ratnam :  కరోనా అందరితో పాటు సినీ పరిశ్రమ వాళ్ళని వదిలిపెట్టట్లేదు. గతంలో చాలా మంది స్టార్లు అన్ని సినీ పరిశ్రమలలోను కరోనా బారిన పడ్డారు. కొంతమంది కోలుకోగా దురదృష్టవశాత్తు కొంతమంది సినీ ప్రముఖులు కరోనాతో మరణించారు. కరోనా తగ్గిపోయింది అనుకున్న ప్రతీ సారి మళ్ళీ విజృంభిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోవడంతో కరోనా మళ్ళీ రోజురోజుకి పెరుగుతుంది.

Ponniyin Selvan : హీరోకి బొట్టు ఉందని మణిరత్నం సినిమాపై కేసు నమోదు..

ఇటీవల మళ్ళీ కరోనా కేసులు ఎక్కువయ్యాయి. సినీ ప్రముఖులు కూడా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడగా ఇప్పుడు కోలీవుడ్ ని కరోనా చుట్టుముట్టింది. రెండు రోజుల క్రితమే నటి వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారిన పడ్డానని తెలిపింది. తాజాగా దర్శకుడు మణిరత్నం కరోనా బారిన పడ్డారు. ఇటీవల జులై 8న మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్ టీజర్ లాంచ్ జరిగింది. ఆ తర్వాత ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మణిరత్నంకి కరోనా సోకడంతో చికిత్స కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న మణిరత్నం ఆరోగ్య వివరాలను హాస్పిటల్ వైద్యులు వెల్లడించలేదు. అభిమానులు మణిరత్నం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.