Minister KTR: తెలంగాణ స్పేస్ టెక్ ఫ్రేంవర్క్ – 2022 ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
మెటావర్స్ వేదికగా తెలంగాణ స్పేస్ టెక్ ఫ్రేం వర్క్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దేశంలో మెటావర్స్ను వాడుతున్న తొలి రాష్ట్రం తెలంగాణగా అభివర్ణించిన కేటీఆర్.. ఈ సందర్భంగా ఇలా..
Minister KTR: మెటావర్స్ వేదికగా తెలంగాణ స్పేస్ టెక్ ఫ్రేం వర్క్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దేశంలో మెటావర్స్ను వాడుతున్న తొలి రాష్ట్రం తెలంగాణగా అభివర్ణించిన కేటీఆర్.. ఈ సందర్భంగా ఇలా మాట్లాడారు.
“కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్టార్టప్లను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నాం. సాంకేతిక రంగంలో అనేక మార్పులు తెచ్చాం. సాగు-బాగు ప్రాజెక్టు ద్వారా అగ్రిటెక్ స్టార్టప్లను ప్రోత్సహించి రైతులకు ఫీల్డ్ లెవల్లో అండగా నిలుస్తున్నాం. హరా-బరా ప్రాజెక్టు ద్వారా అటవీ శాతాన్ని పెంచేందుకు డ్రోన్లతో సీడ్ బాల్స్ వదులుతున్నాం”
“అనేక రంగాలకు సాంకేతికతను అనుసంధానం చేస్తున్నాం. తెలంగాణ స్పేస్ టెక్నాలజీకి గమ్యస్థానంగా మారుతోంది.
ఏప్రిల్ 18న ప్రారంభమైన హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో అతిపెద్ద స్కై వాక్ వే.. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి నేరుగా మైండ్ స్పేస్కి వెళ్లేలా స్కై వాక్ వే నిర్మించారు. ఐటీ సంస్థల్లో పనిచేసే వారు సులువుగా ఆఫీస్లకు వెళ్లేందుకు అనుకూలంగా రూపొందించారు. ఇందుకోసం మైండ్ స్పేస్లో 1కిలోమీటర్ల మేర 3.5 మీటర్ల వెడల్పుతో స్కై వాక్ వే నిర్మాణం పూర్తి చేశారు. ఒకేసారి 35వేల మంది నడిచే సౌకర్యం కల్పించారు.
కార్యక్రమానికి నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, ఇస్రో చైర్మన్ సోమనాథ్, ఇన్ స్పేస్ సంస్థ చైర్మన్ పవన్ గోయంకా, ఐటీ, ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ విచ్చేశారు.