MS Dhoni: ఎంఎస్ ధోనీ తెగ కష్టపడ్డాడు – గౌతం గంభీర్

ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభం నుంచి చెన్నై దూకుడుగానే కనిపించింది. గత సీజన్ వైఫల్యాన్ని అధిగమించాలని ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో జట్టు పట్టుదలగా కనిపించింది.

MS Dhoni: ఎంఎస్ ధోనీ తెగ కష్టపడ్డాడు – గౌతం గంభీర్

Ms Dhoni

MS Dhoni: ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభం నుంచి చెన్నై దూకుడుగానే కనిపించింది. గత సీజన్ వైఫల్యాన్ని అధిగమించాలని ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో జట్టు పట్టుదలగా కనిపించింది. ఎట్టకేలకు శుక్రవారం 2021 అక్టోబర్ 15న జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ టైటిల్ ను దక్కించుకుంది. ఈ విజయం వెనుక అసలు విషయాన్ని బయటపెట్టాడు కోల్‌కతా మాజీ కెప్టెన్ గంభీర్.

ఇయోన్ మోర్గాన్ కెప్టెన్సీలోని కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్ లో హోరాహోరీ పోటీనిచ్చింది. ఎట్టకేలకు మూడోసారి ధోనీసేనకు టైటిల్ విన్నరం కిరీటం దక్కింది. అంతేకాకుండా ఐపీఎల్ 2021 సీజన్లో ప్లేఆఫ్ బెర్త్ సాధించిన తొలి జట్టుగా నిలిచింది.

మరోసారి మాస్టర్ మైండ్ తో వ్యూహాలు రచించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ సందర్భంగా మాజీ టీమ్మేట్ గౌతం గంభీర్.. ధోనీ గురించి ఇలా అన్నాడు.

…………………………………………………. : సోకులతో సెగలు రేపుతున్న సోనాల్

‘వాళ్లు ఇదంతా చాలా ఈజీగా చేసేశారు. అది చాలా గ్రేట్ క్వాలిటీ. ఎంఎస్ ధోనీ ఇటువంటివి సూక్ష్మంగా పట్టించుకుంటాడు. తనకు ఎక్కువ ఆప్షన్లు ఉంటే ఇష్టం. మీరు బాగా పరిశీలిస్తే ధోనీ ఎప్పుడూ ఆరేడు ఆప్షన్లు ముందుంచుకుంటాడు. గేమ్ లో రెండు రకాలుగా ఆడగల ప్లేయర్లకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు’ అని గంభీర్ అన్నాడు.

ఈ సీజన్ లో ధోనీ బ్యాట్ తో చాలా కష్టపడ్డాడు. నిజానికి అంత అవసర్లేదు. ఎందుకంటే డీసెంట్ బ్యాటింగ్ తో ఇంకా చాలా మంది పర్ ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయినప్పటికీ ధోనీ చాలా శ్రమించాడని గంభీర్ చెప్పుకొచ్చాడు.