Nagababu : ఏపీ ప్రభుత్వం, పోసాని పై సెటైర్లు వేసిన మెగా బ్రదర్..

మెగా బ్రదర్ నాగబాబు కూడా పోసాని పై, ఏపీ ప్రభుత్వం పై సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.

Nagababu : ఏపీ ప్రభుత్వం, పోసాని పై సెటైర్లు వేసిన మెగా బ్రదర్..

Nagababu

Naga Babu : గత నాలుగు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ స్పీచ్ పై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. పోసాని కృష్ణ మురళి కూడా రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ని , పవన్ ఫ్యాన్స్ ని విమర్శించారు. దీనిపై జనసేన నాయకులు, మెగా అభిమానులు పోసాని పై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూడా పోసాని పై, ఏపీ ప్రభుత్వం పై సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.

నాగబాబు అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తన అభిమానులతో క్వశన్ & ఆన్సర్స్ తో మాట్లాడతారు. దీంట్లో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా నిన్న కూడా అభిమానులు పోసాని గురించి, ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయాల గురించి నాగబాబుని అడిగారు. దాంతో పోసాని పై స్పందిస్తూ కుక్క మొరిగింది పట్టించుకోవద్దు అని అన్నారు. అంతే కాకుండా పోసాని గతంలో పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ ఉన్న వీడియోని కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ గ్రేట్ హీరో తనతో నేనే నిర్మాతగా సినిమా తీస్తా అని పోసాని అన్నారు. పోసాని మాట్లాడినవి పట్టించుకోవనవసరం లేదు అని వ్యాఖ్యలు చేశారు నాగబాబు.

Nepotism : నెపోటిజంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మల్లికా షెరావత్

ఇక ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయాల్లో తీసుకున్న నిర్ణయాలు దొంగలు సొమ్ము పంచుకున్నట్టు ఉందని ఒక సినీ కామెడీ వీడియో పెట్టి అన్నారు. పేర్ని నాని పై కూడా విమర్శలు చేశారు. పేర్ని నాని అద్భుతంగా నటిస్తాడని అతనికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు అని వ్యాఖ్యానించారు. అలాగే సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం కూడా మెల్లిగా కుదుట పడుతుందని తెలిపారు.