Nagarjuna: అక్కినేని నాగార్జునకు నోటీసులు.. ఏ విషయంలో అంటే..?
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవల బిగ్బాస్ సీజన్ 6ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇక తన సినిమాలపై ఫోకస్ పెట్టాలని చూస్తున్న నాగ్కు తాజాగా నోటీసులు ఇచ్చారు ప్రభుత్వ అధికారులు. దీంతో అక్కినేని అభిమానులు నాగ్కు నోటీసులు ఏ విషయంలో వచ్చాయా అని ఆరా తీస్తున్నారు. అయితే నాగ్కు నోటీసులు ఇచ్చింది తెలంగాణ అధికారులు కాదు.. గోవా అధికారులు.
Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవల బిగ్బాస్ సీజన్ 6ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇక తన సినిమాలపై ఫోకస్ పెట్టాలని చూస్తున్న నాగ్కు తాజాగా నోటీసులు ఇచ్చారు ప్రభుత్వ అధికారులు. దీంతో అక్కినేని అభిమానులు నాగ్కు నోటీసులు ఏ విషయంలో వచ్చాయా అని ఆరా తీస్తున్నారు. అయితే నాగ్కు నోటీసులు ఇచ్చింది తెలంగాణ అధికారులు కాదు.. గోవా అధికారులు.
Nagarjuna: మరో కథను ఓకే చేసిన నాగ్.. కానీ డైరెక్టరే లేడట!
గోవాలోని మాండ్రెమ్ గ్రామంలోని అశ్వేవాడలో అక్రమ నిర్మాణం చేపట్టారంటూ అక్కడి అధికారులు నాగార్జునకు ‘స్టాప్ వర్క్’ నోటీసులు జారీ చేశారు. ఆ గ్రామంలో నాగ్ చేపట్టిన నిర్మాణానికి గ్రామ పంచాయితీ అధికారుల నుంచి సరైన అనుమతులు తీసుకోలేదంటూ వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగ్కు నోటీసులు జారీ చేశారు అక్కడి అధికారులు. అయితే ఈ నోటీసులకు సంబంధించి అక్కినేని నాగార్జున ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.
నాగ్ లాస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. దీంతో తన నెక్ట్స్ మూవీ కోసం ఆయన ప్రస్తుతం కథలను వింటున్నారు. మరి ఈ గోవా నోటీసుల గురించి నాగ్ ఎలా స్పందిస్తారో చూడాలి.