Nayanthara: చెన్నై ఛాయ్ వ్యాపారంలోకి నయనతార

చెన్నైకు చెందిన ఛాయ్ వ్యాపారంలో నయనతార పెట్టుబడులు పెట్టారు. పలువురు ఇన్వెస్టర్లు ఉన్న ఆ ఛాయ్ వాలె బ్రాండ్ లో మరో ఆమె కూడా వాటా కలిశారు. దాని ఫౌండర్ విధుర్ మహేశ్వరీ మాట్లాడుతూ.. వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో నటి నయనతార, డైరక్టర్ విగ్నేశ్ శివన్ కూడా పెట్టుబడులు పెట్టినట్లు ప్రకటించారు.

Nayanthara: చెన్నై ఛాయ్ వ్యాపారంలోకి నయనతార

Nayantara (1)

Nayanthara: చెన్నైకు చెందిన ఛాయ్ వ్యాపారంలో నయనతార పెట్టుబడులు పెట్టారు. పలువురు ఇన్వెస్టర్లు ఉన్న ఆ ఛాయ్ వాలె బ్రాండ్ లో మరో ఆమె కూడా వాటా కలిశారు. దాని ఫౌండర్ విధుర్ మహేశ్వరీ మాట్లాడుతూ.. వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో నటి నయనతార, డైరక్టర్ విగ్నేశ్ శివన్ కూడా పెట్టుబడులు పెట్టినట్లు ప్రకటించారు.

ఏంజిల్ ఇన్వెస్టర్లు అయిన సునీల్ సేథియా, సునీల్ కుమార్ సింఘ్వి, మనీశ్ మార్దియా, యూఎన్ఐ-ఎమ్ నెట్‌వర్క్, ముంబైకు చెందిన ఏంజిల్ నెట్‌వర్క్ ఇప్పటికే భాగస్వాములుగా ఉన్నారు. దాంతో పాటుగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అయిన బెంగళూరుకు చెందిన యూనిలిస్టెడ్ కార్ట్ ఎల్ఎల్పీ (ఆన్ లైన్ ట్రేడింగ్ ప్లాట్ ఫాం), చెన్నై నుంచి మల్టీ ఫ్యామిలీ ఆఫీస్ ఈ ఫండింగ్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ప్రస్తుత ఫండింగ్ లో 80శాతం వరకూ ఫిజికల్ స్టోర్ విస్తరణ కోసమే వాడనున్నాం. వచ్చే ఏడాది కల్లా 35పూర్తి ఫంక్షనరీ స్టోర్స్ రావాలని చూస్తున్నాం. మిగిలిన ఫండింగ్ తో బ్యాక్ ఎండ్ సిస్టమ్, మేనేజెరియల్ టీం విస్తరణ గురించి ఆలోచిస్తున్నాం అని ఛాయ్ వాలె ఫౌండర్ విధుర్ మహేశ్వరీ అన్నారు.

మెట్రో స్టేషన్లు, మాల్స్ లో కొత్త బ్రాంచ్ లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. కొవిడ్ అన్ లాక్ అయిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్, ఈ కామర్స్ బడ్జెట్స్ కేటాయింపులు పెంచుకున్నాం. ఆన్ లైన్ లో కొత్త కస్టమర్ లను ఆహ్వానిస్తూ పాత కస్టమర్లను కంటిన్యూ చేయాలని భావిస్తున్నట్లు మహేశ్వరీ స్పష్టం చేశారు.