Telangana: కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుని ఏడాది వయసున్న చిన్నారి మృతి

కొబ్బరి ముక్క చిన్నారి ప్రాణం తీసింది. కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఏడాది వయసున్న చిన్నారి బాబు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తెలంగాణ, నెక్కొండ మండలంలో జరిగింది.

Telangana: కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుని ఏడాది వయసున్న చిన్నారి మృతి

Telangana: కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఏడాది వయసున్న ఒక చిన్నారి ప్రాణం పోయింది. ఈ ఘటన తెలంగాణ, నెక్కొండ మండలంలో ఆదివారం ఉదయం వేకువఝామున జరిగింది. బదావత్ మాలు-కవిత దంపతులకు ఏడాది వయసున్న మణికంఠ అనే బాబు ఉన్నాడు.

Uttarakhand: విషపూరిత గింజలు తిన్న నలుగురు చిన్నారులు.. ముగ్గురు మృతి.. మరొకరి పరిస్థితి విషమం

ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయంలో చిన్నారి ఏడుస్తుండటంతో, ఇంట్లో పూజకు ఉపయోగించిన కొబ్బరి ముక్క ఇచ్చారు. ఆ కొబ్బరి ముక్క తీసుకున్న చిన్నారి, కొద్దిసేపు ఆడుకుని తిన్నాడు. అయితే, ఆ కొబ్బరి ముక్క చిన్నారి గొంతులో ఇరుక్కుపోయింది. వెంటనే గుర్తించిన బాబు తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కోవడం వల్ల చిన్నారికి సరిగ్గా శ్వాస అందలేదు. దీంతో ఆస్పత్రికి వెళ్లే మార్గం మధ్యలోనే చిన్నారి మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.