Pakistan pm letar : మోదీ లేఖకు స్పందించిన పాక్ ప్రధాని.. కాశ్మీర్ అంశంపై ఏమన్నారంటే?
పాకిస్థాన్ నూతన ప్రధానిగా నియామకమైన షెహబాజ్ షరీఫ్ పాక్ - ఇండియా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఈనెల 11న పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు..
Pakistan pm letar : పాకిస్థాన్ నూతన ప్రధానిగా నియామకమైన షెహబాజ్ షరీఫ్ పాక్ – ఇండియా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఈనెల 11న పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. పాక్ ప్రధానిగా షెహబాజ్ బాధ్యతలు చేపట్టడంతో అభినందిస్తూ భారత్ ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాసిన విషయం విధితమే. దీనికితోడు ట్విట్టర్లోనూ పాక్ ప్రధానిని అభినందిస్తూ మోదీ ట్వీట్ చేశారు. ఉగ్రవాదం లేని ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని భారత్ కోరుకుంటుందని, తద్వారా మన అభివృద్ధి సవాళ్లపై దృష్టిసారించి, మన ప్రజల శ్రేయస్సుకు చేయాలని గత నెల ఏప్రిల్ 11న ప్రధాని ట్వీట్ చేశారు.
స్పందించిన పాక్ ప్రధాని రీ ట్వీట్ చేస్తూ.. శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అంటూ.. భారత్తో శాంతియుత, సహకార సంబంధాలను పాకిస్థాన్ కోరుకుంటోందని, జమ్మూకాశ్మీర్తో సహా అత్యుత్తమ వివాదాల శాంతియుత పరిష్కారం అనివార్యమన్నారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ త్యాగాలు అందరికీ తెలిసిందేనని, శాంతిని కాపాడుకుందాం, మన ప్రజల సామాజిక-ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడదాం అంటూ పాక్ ప్రధాని ట్వీట్ లో పేర్కొన్నారు.
Thank you Premier Narendra Modi for felicitations. Pakistan desires peaceful & cooperative ties with India. Peaceful settlement of outstanding disputes including Jammu & Kashmir is indispensable. Pakistan's sacrifices in fighting terrorism are well-known. Let's secure peace and.. https://t.co/0M1wxhhvjV
— Shehbaz Sharif (@CMShehbaz) April 12, 2022
ఇదిలాఉంటే పాకిస్థాన్తో భారత్ నిర్మాణాత్మక సంబంధాలను కోరుకుంటుందని మోదీ కొద్దిరోజుల క్రితం పాక్ ప్రధానికి తన లేఖలో తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పంపిన లేఖకు ప్రతిలేఖపై పాక్ ప్రధాని స్పందించారు. శనివారం లేఖకు సమాధానం ఇచ్చారు. ఈ లేఖలో భారత్తో శాంతియుత, సహకార సంబంధాలకు పాక్ మొగ్గుచూపుతూనే, కాశ్మీర్తో సహా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని మోదీ లేఖకు ఇచ్చిన సమాధానంలో షరీఫ్ కోరినట్లు తెలిసింది.