Akshay Kumar : అక్షయ కుమార్ సినిమాకి పంజాబ్ రైతుల సెగ

పంజాబ్ లో కూడా అక్షయ్ కుమార్ 'సూర్యవంశి' సినిమా విడుదలైంది. దీంతో కరోనా తర్వాత బాలీవుడ్ నుంచి విడుదల అయిన ఓ స్టార్ హీరో మొదటి సినిమా కావడంతో రైతు చట్టాలకు మద్దతివ్వకుండా మా ప్రాంతం

Akshay Kumar : అక్షయ కుమార్ సినిమాకి పంజాబ్ రైతుల సెగ

Suryavamshi (1)

Akshay Kumar :  బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ వరుసగా సినిమాలు చేస్తూ ఉంటాడు. కరోనా దెబ్బతో అందరితోపాటు ఆయనకి కూడా బ్రేక్ పడింది. కరోనా లాక్ డౌన్ తర్వాత బాలీవుడ్ లో చాలా గ్యాప్ తర్వాత ఓ స్టార్ హీరో సినిమా వచ్చింది. ఇటీవల దీపావళికి అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టించిన ‘సూర్య‌వంశీ’ చిత్రం విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. ఈ సినిమాని చూసి మిగిలిన బాలీవుడ్ సినిమాలు కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Bigg Boss 5 : బిగ్ బాస్ లో ఎవరు హీరో ? ఎవరు విలన్?

అయితే ‘సూర్య‌వంశీ’ సినిమాకి పంజాబ్ రైతుల సెగ త‌గిలింది. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్ రైతులు చాలా కాలంగా ఉద్యమం చేస్తున్నారు. విపక్ష పార్టీలు కూడా ఈ ఒక్క అంశాన్ని గట్టిగా పట్టుకొని రైతులతో కలిసి ధర్నాలు చేస్తున్నారు. అయితే బాలీవుడ్ సినిమాలు నార్త్ మొత్తం విడుదల అవుతాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ లో కూడా అక్షయ్ కుమార్ ‘సూర్యవంశి’ సినిమా విడుదలైంది. దీంతో కరోనా తర్వాత బాలీవుడ్ నుంచి విడుదల అయిన ఓ స్టార్ హీరో మొదటి సినిమా కావడంతో రైతు చట్టాలకు మద్దతివ్వకుండా మా ప్రాంతంలో సినిమా ఎలా విడుదల చేస్తారంటూ రైతులు, విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Suma : ‘జయమ్మ పంచాయితీ’లో సుమక్క.. 25 సంవత్సరాల తర్వాత మెయిన్ లీడ్ లో సుమ

పంజాబ్ లోని హోషియార్ పూర్ లో సినిమా ఫ్లెక్సీలు, బ్యానర్లు చించేసి థియేటర్ వద్ద రచ్చ చేశారు. రైతు చట్టాలను రద్దు చేసే వరకు ఆ సినిమాని ఆడనివ్వబోమంటూ ధర్నా చేశారు. ఈ సినిమానే కాదు ఎవ‌రి సినిమా ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగినా మేం ఇంతే చేస్తామంటూ ఈ ధర్నాలో రైతులు తెలిపారు. ఇప్ప‌టికే క‌రోనా వ‌ల‌న క‌ష్టాలు ఎదుర్కుంటున్న సినీ పరిశ్రమకి దీంతో సినిమా వసూళ్ళలో మరోసారికష్టాలు తప్పవని తెలుస్తుంది. రానున్న రోజుల‌లో ఇంకెంత మంది స్టార్స్ పంజాబ్ రైతుల ఆగ్ర‌హానికి గుర‌వుతారో లేదా సినిమాలని పంజాబ్ లో రిలీజ్ చేయకుండా చూసుకుంటారో చూడాలి.