Maharashtra: అవును మాది ‘ఈడీ’ ప్రభుత్వమే: దేవేంద్ర ఫడ్నవీస్
''ఒకవేళ ఇంట్లోనే కూర్చోవాలని మా పార్టీ నాకు చెబితే నేను పార్టీ చెప్పినట్లు చేసేవాడిని. గతంలో ఇదే పార్టీ నన్ను ముఖ్యమంత్రిని చేసింది. అధికారం కోసం ఈ ప్రభుత్వంలో ఎలాంటి గొడవలూ జరగవు. కొందరు మా సర్కారుని ఈడీ ప్రభుత్వం అని అంటున్నారు. అవును.. ఇది ఈడీ ప్రభుత్వమే. ఇది ఏక్నాథ్-దేవేంద్ర (ఈడీ) ప్రభుత్వం'' అని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండ్ గెలుపొందాక ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడారు. కొన్ని రోజులుగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను ఆయన ప్రస్తావించారు. ”2019 ఎన్నికల తర్వాత శివసేన-బీజేపీ కూటమికి మెజారిటీ వచ్చింది. అయితే, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాం. ఇప్పుడు ఏక్నాథ్ షిండేతో కలిసి మళ్ళీ మహారాష్ట్రలో శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. నిజమైన శివసైనిక్ను సీఎంను చేశాం. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు నేను డిప్యూటీ సీఎం అయ్యాను” అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
Maharashtra: బలపరీక్షలో ఏక్నాథ్ షిండే విజయం
”ఒకవేళ ఇంట్లోనే కూర్చోవాలని మా పార్టీ నాకు చెబితే నేను పార్టీ చెప్పినట్లు చేసేవాడిని. గతంలో ఇదే పార్టీ నన్ను ముఖ్యమంత్రిని చేసింది. అధికారం కోసం ఈ ప్రభుత్వంలో ఎలాంటి గొడవలూ జరగవు. మేము ప్రభుత్వానికి ఎప్పటికీ సహకరిస్తాం. కొందరు మా సర్కారుని ఈడీ ప్రభుత్వం అని అంటున్నారు. అవును.. ఇది ఈడీ ప్రభుత్వమే. ఇది ఏక్నాథ్-దేవేంద్ర (ఈడీ) ప్రభుత్వం” అని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. కాగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో కేంద్రంలోని బీజేపీ సర్కారు దాడులు చేయిస్తూ ప్రతిపక్షాలను భయపెడుతూ దారికి తెచ్చుకుంటోందంటూ విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే.