Physical Inactivity : ఉరుకులు పెట్టండి, పరుగులు తీయండి, వ్యాయామం చేయండి.. లేకపోతే ప్రమాదం – సర్వేల వెల్లడి

వ్యాయామం చేసే అలవాటు లేదా ? అయితే మీకు కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉంది. తీవ్రమైన లక్షణాలు సంక్రమించే ప్రమాదం ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

Physical Inactivity : ఉరుకులు పెట్టండి, పరుగులు తీయండి, వ్యాయామం చేయండి.. లేకపోతే ప్రమాదం – సర్వేల వెల్లడి

Corona Physical

COVID-19 : : వ్యాయామం చేసే అలవాటు లేదా ? అయితే మీకు కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉంది. తీవ్రమైన లక్షణాలు సంక్రమించే ప్రమాదం ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో 50 వేల మందిపై ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనట్లు ‘బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స మెడిసిన్’ నివేదికలో వెల్లడించింది. వృద్ధులు, అవయవదానాలు చేసిన వారిలో అత్యధికంగా ఈ వైరస్ వ్యాపిస్తోందని, ఫలితంగా దుష్ప్రభావాలను చవి చూస్తోందని తెలిపింది.

పొగతాగే అలవావాటు ఉన్న వారు, ఊబకాయం, హైపర్ టెన్షన్ ఉన్నవారి కన్నా..వీరే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని, అలాగే శారీరక శ్రమ లేని వారిపై ప్రభావం చూపిస్తోందని నివేదికలో వెల్లడించారు. శరీరానికి తగినంత వ్యాయామం లేకపోతే..తీవ్రమైన ఇన్ఫెక్షన్, హాస్పిటలైజేషన్, ఐసీయూ పాలవ్వడం, మరణం వంటివి సంభవించే అవకాశాలున్నాయని గుర్తించారు. ఇప్పటి వరకు శారీరక శ్రమ లేకపోవడాన్ని ఇప్పటి వరకు రిస్క్ జాబితాలో చేర్చలేదు. మార్చి 2018 నుంచి మార్చి 2020 మధ్య వారి శారీరక శ్రమ సగటు సమయాన్ని నమోదు చేశారు.

వీరిలో 15 శాతం మంది వారానికి కేవలం 10 నిమిషాల్లోపు వ్యాయామం చేస్తున్నారని, 80 శాతం మంది వారానికి 11 నిమిషాల నుంచి 149 నిమిషాల పాటు శారీరక శ్రమ పడుతున్నారని తెలిపారు. ఇక మిగిలిన వారు 150 నిమిషాలు అంతకంటే ఎక్కువగా వ్యాయామం చేస్తున్నారని వివరించారు. ఎంతోకొంత వ్యాయామం చేసే వారికంటే..సోమరిగా ఉండే వారే 20 శాతం అదనంగా ఆసుపత్రి పాలవుతున్నట్లు తెలిపారు. అమెరికాలో 2020, జనవరి నుంచి అక్టోబర్ మధ్య కరోనా బారిన పడిన 48 వేల 440 మందిపై పరిశోధన నిర్వహించారు. 47 ఏళ్ల ఉండిన వారిని మాత్రమే ఎంచుకున్నారు.

ఐదుగురు రోగుల్లో ముగ్గురు మహిళలు ఉండగా..వీరి బీఎంఐ 31 శాతానికి పైగా ఉందని..ఈ మొత్తం దాటితే ఊబకాయంగా పరిగణిస్తారని తెలిపారు. ఈ రోగుల్లో సగం మందికి ముందస్తుగా హృద్యోగాలు, కిడ్నీ సమస్యలు, కేన్సర్ వంటి సమస్యలు లేవు. 20 శాతం మందిలో ఒక సమస్య ఉండగా..మరో 30 శాతం మందికి రెండు సమస్యలున్నాయి. ఆసుపత్రి పాలైన సాధారణ రోగులతో పోలిస్తే..73 శాతం అదనంగా వీరు ఐసీయూలో చేరారు. వీరిలో మృత్యువాత పడే వారి శాతం 2.5 రెట్లు ఎక్కువగా ఉంది.

Read More : Corona Danger Bells : ఇంట్లో ఉన్న మాస్క్ కంపల్సరీ, నిర్లక్ష్యం చేస్తే…తీవ్ర పరిణామాలు – వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర హెచ్చరికలు