Telangana Politics : కాంగ్రెస్ లో చేరనున్న పీజేఆర్ కూతురు విజయారెడ్డి..

గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. దివంగత నేత పీజేఆర్ కూతురు..టీఆర్ఎస్ కార్పెరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటానికి రెడీ అయిపోయారు.పార్టీ మారకుండానే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన పక్కనే ప్రత్యక్షమయ్యారు విజయారెడ్డి.

Telangana Politics : కాంగ్రెస్ లో చేరనున్న పీజేఆర్ కూతురు విజయారెడ్డి..

Pjr Daughter Vijayareddy To Join Congress Party

Telangana Politics : గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. దివంగత నేత పీజేఆర్ కూతురు..టీఆర్ఎస్ కార్పెరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటానికి రెడీ అయిపోయారు.పార్టీ మారకుండానే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన పక్కనే ప్రత్యక్షమయ్యారు విజయారెడ్డి. దీంతో ఆమె టీఆర్ఎస్ ను వీడటం..కాంగ్రెస్ లోకి చేరిపోవటం ఖాయంగా ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డితో భేటీ అయిన విజయారెడ్డి అన్ని విధాలుగా కాంగ్రెస్ లోకి చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

ఈ ప్రెస్ మీట్ తరువాత విజయారెడ్డి తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఖైరతాబాద్ టీఆర్ఎస్ కార్పెరేటర్ గా ఉన్న విజయారెడ్డి గతంలో అంటే 2018లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా యత్నించారు. కానీ ఫలితం దక్కేలేదు. అప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్ఎస్ లోకి చేరటంతో ఆయనకు టీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. దీంతో విజయారెడ్డికి తీవ్ర నిరాశ ఎదురైంది.

ఈ క్రమంలో కార్పెరేట్ గా టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడి విజయం సాధించారు.అనంతరం తనకు మేయర్ పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. కానీ ఆ ఆశలు కూడా ఫలించలేదు. దీంతో టీఆర్ఎస్ లో తన రాజకీయ జీవితం ఎదిగే అకాశాలు లేనట్లుగా భావించిన విజయారెడ్డి కాంగ్రెస్ లోకి చేరాలని భావించినట్లుగా తెలుస్తోంది.

కాగా..హైదరాబాద్‌కి చెందిన దివంగత రాజకీయ నాయకుడు పి.జనార్దన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి తండ్రి మరణం తరువాత కొంతకాలానికి రాజకీయాల్లోకి వచ్చారు.అలా కొంత కాలం కాంగ్రెస్‌ పార్టీలో వున్నారు. అలా మరికొంతకానికి ఆమె టీఆర్ఎస్ లో చేరారు.