PM Modi: విద్యార్థులకు వ్యాక్సిన్ అందించడం కోసం ప్రధాని మోదీ పిలుపు

కొవిడ్-19 టీకా అందించడంలో విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్సులో మాట్లాడిన ఆయన.. చిన్నారులకు ప్రియారిటీ ఇవ్వాలని సూచించారు.

PM Modi: విద్యార్థులకు వ్యాక్సిన్ అందించడం కోసం ప్రధాని మోదీ పిలుపు

Pm Modi

 

 

PM Modi: కొవిడ్-19 టీకా అందించడంలో విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్సులో మాట్లాడిన ఆయన.. చిన్నారులకు ప్రియారిటీ ఇవ్వాలని సూచించారు.

“కోవిడ్-19 సంక్షోభం ఇంకా ముగిసిపోలేదని సూచిస్తూ.. వ్యాక్సిన్ తీసుకునే వయస్సున్న పిల్లలందరికీ వ్యాక్సిన్ డోసులను వేగంగా అందించాలి. చాలాకాలం తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇదే సమయంలో కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి”

“పిల్లలకు వ్యాక్సిన్ అందించడాన్ని వేగవంతం చేసేందుకు స్కూళ్లలోనే ప్రత్యేక క్యాంపులు పెట్టాలి. వాటి గురించి విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లకు ముందుగా తెలియపరచాలి” అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Read Also: తగ్గుతున్న కరోనా.. పెరుగుతున్న వ్యాక్సినేషన్