Tributes : వీర జవాన్లకు నివాళులర్పించిన మోదీ,ఇతర ప్రముఖులు

  తమిళనాడులోని కూనూర్ వద్ద బుధవారం హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్​ జనరల్​ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివ దేహాలను ఢిల్లీలోని పాలెం ఎయిర్​ బేస్​కు

Tributes :  వీర జవాన్లకు నివాళులర్పించిన మోదీ,ఇతర ప్రముఖులు

Pm Modi

PM Modi :  తమిళనాడులోని కూనూర్ వద్ద బుధవారం హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్​ జనరల్​ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివ దేహాలను ఢిల్లీలోని పాలెం ఎయిర్​ బేస్​కు తీసుకొచ్చారు. సూలూరు ఎయిర్‌ బేస్‌ నుంచి C-130J ఎయిర్‌క్రాప్ట్‌ భౌతికకాయాలతో గురువారం మధ్యాహ్నం బయలుదేరి.. సాయంత్రానికి చేరుకుంది.

8:30గంటల సమయంలో పాలెం ఎయిర్ బేస్ కు వెళ్లిన మోదీ…బిపిన్ రావత్ దంపతులతో పాటు 11మంది జవాన్ల పార్థీవదేహాలకు నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటంబసభ్యులను మోదీ పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎయిర్ చీఫ్ మార్షల్,ఆర్మీ చీఫ్,ఇతర ఉన్నతాధికారులు వీర జవాన్లకు నివాళులర్పించారు.

అంతకుముందు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్,జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్ జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివదేహాలకు నివాళులర్పించారు. అమరుల కుటుంబాలతో మాట్లాడి.. ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ALSO READ Tributes : పార్థీవ దేహాలకు కుటుంబసభ్యుల నివాళి..శ్రద్ధాంజలి ఘటించిన దోవల్,రాజ్ నాథ్