agnipath: తెలంగాణ పోలీసుల అదుపులో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సుబ్బారావు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనలు చేయించడానికి కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటోన్న కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సుబ్బారావును తెలంగాణ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

agnipath: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనలు చేయించడానికి కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటోన్న కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సుబ్బారావును తెలంగాణ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఐటీ విచారణ ముగియడంతో పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ఆయన విద్యార్థులను రెచ్చగొట్టారు. ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆయన తొమ్మిది శిక్షణా కేంద్రాలను నడుపుతున్నారు.
agnipath: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనల్లో పాల్గొన్న యువకుడి ఆత్మహత్యాయత్నం
ఆర్మీ కోచింగ్ సెంటర్ పేరుతో ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2 లక్షల చొప్పున ఫీజు తీసుకుంటున్నారు. అభ్యర్థులు తన అకాడెమీలో చేరేలా ఫీజులను విడతల వారీగా చెల్లించే అవకాశం కల్పించారు. తన వద్ద శిక్షణ తీసుకుంటే ఉద్యోగానికి ఎంపిక గ్యారెంటీ అని హామీలు ఇచ్చేవారు. మొదట రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే చాలంటు అభ్యర్థులను ఆకర్షించేవారు. ఆర్మీకి ఎంపికైన అనంతరం మిగతా ఫీజు మొత్తాన్ని చెల్లించేలా అభ్యర్థులకు కొటేషన్ ఇచ్చేవారు. అయితే, గ్యారెంటీ కింద అభ్యర్థులకు చెందిన 10 వ తరగతి మెమోలను తన దగ్గరే పెట్టుకునేవారు.
Agnipath: అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తేలేదు: అజిత్ డోభాల్
ఇప్పటికే ప్రాథమిక పరీక్షను అభ్యర్థులు పూర్తి చేసుకున్నారు. ఇక రాత పరీక్ష పూర్తయితే అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో సుబ్బారావుకు ఫీజులు అందేవి. అయితే, రాత పరీక్ష లేదని చెబుతూ కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించడంతో దాదాపు రూ.50 కోట్లు నష్టపోయారు. దీంతో ఎలాగైనా అభ్యర్థులను రెచ్చగొట్టి రాత పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ప్రణాళిక వేసుకున్నట్లు తెలిసింది. పల్నాడు జిల్లా రావిపాడు పంచాయతీ పరిధిలో లో బై పాస్ రోడ్లో సాయి అకాడెమీ మెయిన్ బ్రాంచ్ ఉంది. 3 రోజుల పాటు సాయి డిఫెన్స్ అకాడెమీలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. సోదాల్లో హార్డ్ డిస్క్లతో పాటు అనేక మంది అభ్యర్థుల 10 వ తరగతి మెమోలను స్వాధీనం చేసుకున్నారు.
మూడు రోజులుగా సుబ్బారావును ఐటీ అధికారులు విచారించారు. నిన్న విచారణ ముగియడంతో సుబ్బారావును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- Agnipath: 57,000కు చేరిన అగ్నిపథ్ దరఖాస్తులు
- Maharashtra Governor : రంగంలోకి మహారాష్ట్ర గవర్నర్..రెబల్ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశం
- Secunderabad Protests: సుబ్బారావు రిమాండ్పై కొనసాగుతున్న సస్పెన్స్.. అసలేం జరుగుతుందంటే..
- Uttar Pradesh: తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన పెళ్లికొడుకు.. ఒకరి మృతి.. వీడియో
- Agnipath: అగ్నిపథ్ నిరసనలు.. రైల్వేకు వెయ్యి కోట్ల నష్టం
1Jasprit Bumrah: సారథిగా కంటే బౌలర్గానే జట్టుకు బాగా అవసరం: ద్రవిడ్
2HICC : శత్రుదుర్భేద్యంగా హెచ్ఐసీసీ, నోవాటెల్ పరిసర ప్రాంతాలు.. 2,500 మంది పోలీసులతో పహారా
3Mahankali Bonalu : భాగ్యనగరం ఉమ్మడి దేవాలయాల మహంకాళి బోనాల జాతరపై సమీక్ష సమావేశం
4Tana Toraja : చెట్ల తొర్రల్లో పిల్లల శవాలు..ఆ చెట్లనే బిడ్డలుగా చూసుకుంటున్న తల్లిదండ్రులు
5Kollu Ravindra : మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నానిపై కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు
6Maharashtra: ఇదే పని రెండున్నరేళ్ళ క్రితం బీజేపీ ఎందుకు చేయలేదు?: ఉద్ధవ్ ఠాక్రే
7సబ్జెక్ట్ నేర్చుకో రాంబాబు..!
8Manchu Mohan Babu: మంచు వారి ‘అగ్ని నక్షత్రం’!
9Head Lice : తలలో పేల సమస్యతో బాధపడుతున్నారా!
10గాంధీ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన
-
TET Results : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
-
Sree Vishnu: నిజాయితీకి మారుపేరు.. అల్లూరి!
-
Yogurt : పెరుగు ఆరోగ్యానికే కాదు, చర్మ సంరక్షణలోనూ!
-
Tirumala Srivaru : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం
-
Liver Cancer : ప్రాణాలు తీస్తున్న కాలేయ క్యాన్సర్
-
The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!