Prabhas: ప్రభాస్ ముందుగా ఏ సినిమాను తీసుకొస్తాడో..?

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన క్రేజ్‌తో పాన్ ఇండియా స్టార్‌గా తన సత్తా చాటుకున్నాడు ఈ స్టార్ హీరో. అయితే బాహుబలి తరువాత ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్‌ను కాపాడుకోవడానికి ఇప్పుడు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తన నెక్ట్స్ సినిమాలుగా ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-K వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను తెరకెక్కిస్తున్నాడు.

Prabhas: ప్రభాస్ ముందుగా ఏ సినిమాను తీసుకొస్తాడో..?

Prabhas To Bring Salaar Project K Before Adipurush

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన క్రేజ్‌తో పాన్ ఇండియా స్టార్‌గా తన సత్తా చాటుకున్నాడు ఈ స్టార్ హీరో. అయితే బాహుబలి తరువాత ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్‌ను కాపాడుకోవడానికి ఇప్పుడు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తన నెక్ట్స్ సినిమాలుగా ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-K వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను తెరకెక్కిస్తున్నాడు.

Prabhas: ప్రభాస్-మారుతి మూవీలో బాలీవుడ్ హీరో అలాంటి పాత్ర చేస్తాడా..?

అయితే బాహుబలి తరువాత ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్‌లో అలాంటి హిట్ అందుకోలేదు. సాహో కాస్త పర్వాలేదనిపించినా ఆ తరువాత రాధేశ్యామ్ సినిమా మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో మరోసారి పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభాస్ తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదిపురుష్ సినిమాతో మరోసారి గ్రాండ్ సక్సెస్ కొట్టాలని చూసిన ప్రభాస్‌కు ఈ చిత్ర టీజర్‌తోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్ర టీజర్‌కు పెద్ద స్థాయిలో విమర్శలు రావడంతో ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులను మరింత గ్రాండ్‌గా ఉండేలా చిత్ర యూనిట్ ప్రస్తుతం వర్క్ చేస్తోంది.

Prabhas : వింటేజ్ ప్రభాస్‌ని చూసి ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్..

కాగా, ఈ క్రమంలోనే ప్రభాస్ తన నెక్ట్స్ మూవీలుగా సలార్, ప్రాజెక్ట్-Kలను వీలైనంత త్వరగా పూర్తి చేసి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ప్రశాంత్ నీల్ కేజీయఫ్ చిత్రాల తరువాత చేస్తున్న సినిమా కావడంతో, సలార్ మూవీపై ఖచ్చితంగా ఇండియావైడ్ గా అంచనాలు ఉంటాయని.. అటు ‘మహానటి’ తరువాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్-K కూడా ప్రేక్షకుల్లో క్రేజ్ ను సాధించిందని ప్రభాస్ భావిస్తున్నాడు. అందుకే ముందుగా ఈ రెండు సినిమాలను 2023లో రిలీజ్ చేయాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడట. అటుపై 2024లో ఆదిపురుష్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావాలని ట్రై చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. మరి ప్రభాస్ మాస్టర్ ప్లాన్ ఎంతమేర వర్కవుట్ అవుతుందో చూడాలి.