Natti Kumar : డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళని బ్యాన్ చేయగలరా..?

‘DSJ (దెయ్యంతో సహజీవనం)’ సినిమా టీజర్ లాంచ్ ప్రెస్ మీట్‌లో ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితులపై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు..

Natti Kumar : డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళని బ్యాన్ చేయగలరా..?

Natti Kumar

Natti Kumar: ఇటీవల హీరోయిన్ పూజా హెగ్డే పారితోషికం, అసిస్టెంట్స్ గురించి సీనియర్ నటి, ఎమ్మెల్యే రోజా భర్త.. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఆర్.కె. సెల్వమణి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత నిర్మాత నట్టి కుమార్ కూడా ఆమెకి అనవసరంగా సినిమాకి రూ. 3 కోట్లు ఇస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు మరోసారి నట్టి కుమార్ తన స్టైల్లో చేసిన కామెంట్స్ ఫిలిం ఇండస్ట్రీలో సెన్సేషన్ అవుతున్నాయి.

R K Selvamani : ఇది మంచిది పద్ధతి కాదు.. పూజా హెగ్డేపై రోజా భర్త ఫైర్..

నట్టి లక్ష్మీ, అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ కథానాయికగా పరిచయమవుతున్న సినిమా.. ‘DSJ (దెయ్యంతో సహజీవనం)’ తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ప్రెస్ మీట్‌లో ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితులపై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Deyyamtho Sahajeevanam : నట్టి కరుణ హీరోయిన్‌గా ‘దెయ్యంతో సహజీవనం’..

ఆయన మాట్లాడుతూ.. ‘‘చిన్న సినిమాలకి థియేటర్స్ దొరకటం లేదు.. ప్రేక్షకులు థియేటర్స్‌లో సినిమాలు చూడడానికి రెడీగా ఉన్నారు. జీవో 35 ప్రకారం టిక్కెట్ రేటు 100 రూపాయలు మాత్రమే ఉండాలి. టిక్కెట్ రెట్లు పెంచి ప్రేక్షకులను దోచుకుంటున్నారు. హీరోలు మీ రెమ్యునరేషన్ తగ్గించుకోండి. నిన్న కాక మొన్న వచ్చిన హీరోయిన్స్‌కి కూడా రెమ్యునరేషన్ బాగా పెంచి ఇస్తున్నారు.. ఇప్పుడు మీడియాలో న్యూస్ అంతా డ్రగ్స్ స్టార్స్ మీదే. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అది వాళ్ల మేనేజర్లే కారణం. నేను ‘మా’ కార్యవర్గాన్ని, ఫిలిం ఛాంబర్‌నీ అడుగుతున్నాను.. డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళని మీరు బ్యాన్ చేయగలరా?’’ అంటూ నట్టి కుమార్ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి.

Poonam Kaur : డ్రగ్స్ కేసుపై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్