Pushpa: పుష్ప-3కి అంత సమయం పడుతుందా.. ప్రేక్షకులు అంత ఓపిగ్గా వెయిట్ చేస్తారా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండగా, ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. కాగా ఈ సినిమాలో బన్నీ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Pushpa: పుష్ప-3కి అంత సమయం పడుతుందా.. ప్రేక్షకులు అంత ఓపిగ్గా వెయిట్ చేస్తారా?

Pushpa 3 Movie To Take Four Years Of Time

Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండగా, ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. కాగా ఈ సినిమాలో బన్నీ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Pushpa 2 : పుష్ప-2 షూటింగ్ అప్డేట్ వచ్చేసింది..

అయితే సినీ వర్గాల్లో పుష్ప సీక్వెల్ చిత్రాల గురించి కొద్దిరోజులుగా ఓ చర్చ సాగుతోంది. పుష్ప 2 తరువాత మరికొన్ని పుష్ప సీక్వెల్స్ ఉంటాయని.. ఈ సినిమాలను కూడా మల్టీవర్స్ మూవీగా సుకుమార్ తెరకెక్కించాలని చూస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ క్రమంలోనే పుష్ప పార్ట్ 3 కథకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తోంది. పుష్ప-2లో సిండికేట్‌ను తన గుప్పిట్లో పెట్టుకున్న పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ కారణంగా ఎలా పతనమవుతాడు అనేది మనకు చూపిస్తారట.

Pushpa: ఇదెక్కడి మాస్ మావా.. పుష్ప పార్ట్ 3 కూడానా?

కాగా, పుష్ప పార్ట్ 3లో మళ్లీ తాను ఓడిపోయిన చోటే ఎలా నెగ్గుకువస్తాడు.. తనకంటూ ఓ భారీ సామ్రాజ్యాన్ని ఎలా క్రియేట్ చేస్తాడనేది మనకు చూపిస్తారట. అయితే ఈ కథలో ఎంతవరకు నిజం ఉందనే విషయం పక్కనబెడితే, అభిమానులు మాత్రం ఇలాంటి కథను కోరుకోవడం విశేషం. కానీ, పుష్ప పార్ట్ 3 సినిమా పట్టాలెక్కాలంటే బన్నీ తన నెక్ట్స్ కమిట్‌మెంట్స్ పూర్తి చేసుకున్నాకే మళ్లీ సుకుమార్‌తో చేతులు కలుపుతాడు. దీనికి ఎంతలేదన్నా కనీసం 4-5 సంవత్సరాలు పడుతుందని తెలుస్తోంది. ఇక సుకుమార్ తనదైన మార్క్ టేకింగ్‌తో పుష్ప-2 సినిమాను తీర్చిదిద్దేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.