Radhakrishna : ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మౌత్ ఆర్టిస్ట్ పై రాధేశ్యామ్ డైరెక్టర్ ప్రశంశలు.. నీపై సినిమా తీస్తారంటూ..
తాజాగా 'రాధేశ్యామ్'ని చూసి ఆ సినిమా తనకు ఎలా స్ఫూర్తినిచ్చిందో అంటూ ఓ పెయింట్ ని వేసి ట్వీట్ చేసింది. ఆ పెయింట్, ట్వీట్ ని డైరెక్టర్ రాధేశ్యామ్ చూసి అభినందించారు.......
Radheshyam : ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ ఇటీవల మార్చి 11న విడుదలై మంచి విజయం సాధించి భారీ కలెక్షన్లను సాధిస్తుంది. అయితే ఈ సినిమా థీమ్ ఒక యువతిని ప్రేరేపించింది. ఆమె ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలోని ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మౌత్ ఆర్టిస్ట్ స్వప్నిక. ఈమె గతంలో కూడా అనేక బొమ్మలని నోటితో పెయింట్ వేసింది. పవన్ కళ్యాణ్ ఫోటోని కూడా వేసి పాపులర్ అయింది. తాజాగా ‘రాధేశ్యామ్’ని చూసి ఆ సినిమా తనకు ఎలా స్ఫూర్తినిచ్చిందో అంటూ ఓ పెయింట్ ని వేసి ట్వీట్ చేసింది.
ఆ పెయింట్, ట్వీట్ ని డైరెక్టర్ రాధేశ్యామ్ చూసి అభినందించారు. పలు ప్రెస్ మీట్స్ లో కూడా దీనిపై మాట్లాడారు. తాజాగా డైరెక్టర్ రాధాకృష్ణ ఆ అమ్మాయిని కలుసుకున్నాడు. ఆమెతో పాటు ఆమె గీసిన పెయింట్ తో ఫోటో దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమెతో దిగిన ఫోటోని షేర్ చేసి.. ”రాధేశ్యామ్ మీకు స్ఫూర్తినిచ్చింది. మీరు ఈ రోజు నాతో పాటు, దేశాన్ని కూడా ప్రేరేపించారు. నాలాంటి దర్శకులు ఏదో ఒకరోజు నీ మీద సినిమా చేస్తారని నమ్ముతున్నాను. దేవుడు నిన్ను చల్లగా చూడాలి” అంటూ రాధాకృష్ణ ట్వీట్ చేశారు.
Gopichand Malineni : NBK 107 సెట్లో గోపీచంద్ మలినేని బర్త్డే సెలెబ్రేషన్స్
ఇక రాధాకృష్ణ స్వప్నికని కలిసి అభినందించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దర్శకుని మంచితనాన్ని ప్రశంశిస్తున్నారు.
#radheshyam inspired you and you inspired the nation today Swapnika @PawanSister I believe directors like me will do a movie on you one day!! God bless you ??? pic.twitter.com/fHynWQVtpV
— Radha Krishna Kumar (@director_radhaa) March 13, 2022