Rahul gandhi: నేడు, రేపు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన.. షెడ్యూల్ ఇలా..

ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహల్ గాంధీ నేడు, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. నేడు సాయంత్రం హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రైతు సంఘర్షణ సభకు రాహుల్ హాజరవుతారు. రైతు సంఘర్షణ సభ ద్వారా ...

Rahul gandhi: నేడు, రేపు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన.. షెడ్యూల్ ఇలా..

Rahual Gandi

Rahul gandhi: ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహల్ గాంధీ నేడు, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. నేడు సాయంత్రం హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రైతు సంఘర్షణ సభకు రాహుల్ హాజరవుతారు. రైతు సంఘర్షణ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తామనేది ప్రకటించే అవకాశాలున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు, రుణమాఫీ, మద్దతు ధర తదితరాలపై రాహుల్ కీలక ప్రకటనలు, హామీలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్న ఇబ్బందులను ఎత్తి చూపడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయాలకు మార్గనిర్దేశం చేయనున్నారు. వరంగల్ సభకు రాహుల్ రానున్నండటంతో భారీ సంఖ్యలో ప్రజలను తరలించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. జిల్లాల వారిగా ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్ నేతలు.. రాహుల్ సభ విజయవంతానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. బహిరంగ సభ నేపథ్యంలో హనుమకొండలో భారీ కటౌట్లు, పార్టీ జెండాలతో కాంగ్రెస్ నేతలు అలంకరించారు. సభా ప్రాంగణంలో మూడు భారీ వేదికలను ఏర్పాటు చేశారు. రాహుల్ ప్రసంగించే ప్రధాన వేదికతో పాటు రైతులు, కళాకారుల కోసం మరో రెండు వేదికలను వేర్వేరుగా సిద్ధం చేశారు.

Rahul gandhi: ఎవరీ సుమ్మిమా ఉదాస్..? ఆమెతో రాహుల్‌కున్న సంబంధమేంటి?
రాహుల్ పర్యటన వివరాలిలా..
6వ తేదీ శుక్రవారం సాయంత్రం 4:50కి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాహుల్ గాంధీ చేరుకుంటారు. 5:10గంటలకు హెలికాప్టర్‌లో నేరుగా వరంగల్ బయలుదేరుతారు, 5:45 గంటలకు వరంగల్‌లోని సెయింట్ గాబ్రియెల్ స్కూల్‌కు చేరుకొని విశ్రాంతి తీసుకుంటారు. 6:05గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో జరిగే రైతు సంఘర్షణ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆత్మహత్య చేసుకున్న పలువురు రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. రాత్రి 8గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు బయల్దేరుతారు. రాత్రి 10.40 గంటలకు హైదరాబాద్ చేరుకొని.. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో బస చేస్తారు.

Rahul gandhi: ఎవరీ సుమ్మిమా ఉదాస్..? ఆమెతో రాహుల్‌కున్న సంబంధమేంటి?

7వ తేదీ పర్యటన ఇలా..
7వ తేదీ (శనివారం) పలు కార్యక్రమాల్లో రాహల్ గాంధీ పాల్గోనున్నారు. ఉదయం తాజ్‌కృష్ణ హోటల్‌లో పలువురు ప్రముఖులు, మీడియా పెద్దలతో రాహుల్ సమావేశమవుతారు. మధ్యాహ్నం 12:30 గంటలకు సంజీవయ్య పార్కుకు బయలుదేరుతారు. 12:50 నుంచి 1:10 గంటల వరకు సంజీవయ్య పార్కులోని విగ్రహం వద్ద మాజీ సీఎం దామోదర సంజీవయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. 1:30 గంటలకు గాంధీ‌భవన్‌కు చేరుకుంటారు. టీపీసీసీ నిర్వహించే ప్రత్యేక సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అమలు చేయాల్సిన కార్యాచరణపై మాట్లాడుతారు. మధ్యాహ్నం 2.50 నుంచి 3:50 గంటల వరకు.. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదు చేసిన కోఆర్డినేటర్లతో భేటీ అవుతారు. వారితో ఫొటోలు దిగుతారు. సాయంత్రం 4గంటలకు గాంధీ‌భవన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరుతారు. సాయంత్రం 5.40 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్తారు.