Ram Charan : రామ్ చరణ్, బాలయ్య బాబు గణతంత్ర వేడుకలు
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అరవింద్ కలిసి 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అందరికి..
Ram Charan : ఇవాళ జనవరి 26 రిపబ్లిక్ డేని పురస్కరించుకొని పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొంతమంది సెలబ్రిటీలు వారి ఆఫీస్ ప్లేసెస్ లో జెండా ఎగురవేసి గణతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అరవింద్ కలిసి 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే సందర్బంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేస్తున్న ప్రతిఒక్కరిని పలకరించారు.
Chiranjeevi: చిరంజీవికి కరోనా పాజిటివ్
నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో రిపబ్లిక్ డే వేడుకల్ని జరిపారు. జెండా ఎగురవేసి ఆ తర్వాత ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు నివాళులు అర్పించారు. అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.