KGF 2 : డియర్ బ్రదర్ అంటూ యశ్, నీల్‌పై చరణ్ స్పెషల్ ట్వీట్

తాజాగా ‘కేజీఎఫ్‌ 2’ సినిమా చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాపై, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యశ్ లపై స్పెషల్ ట్వీట్ చేశాడు. చరణ్ ఈ ట్వీట్ లో........

KGF 2 : డియర్ బ్రదర్ అంటూ యశ్, నీల్‌పై చరణ్ స్పెషల్ ట్వీట్

Charan

Ram Charan :  ప్రస్తుతం దేశమంతటా ‘కేజీఎఫ్‌ 2’ సంచలనం సృష్టిస్తుంది. సినిమా రిలీజ్ అయి వారం రోజులు దాటినా ఇంకా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లని కురిపిస్తుంది. యశ్, సంజయ్ దత్, రవీనా టాండన్.. ఇలా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దేశం మొత్తం అన్ని చోట్ల ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం ‘కేజీఎఫ్‌ 2’ సినిమాపై అభినందనలు కురిపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్లు, సెలబ్రిటీలు ఈ సినిమా చూసి ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు.

ప్రస్తుతం RC15 సినిమా షూట్ లో బిజీబిజీగా ఉన్న చరణ్ ఇటీవలే పంజాబ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చారు. తాజాగా ‘కేజీఎఫ్‌ 2’ సినిమా చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాపై, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యశ్ లపై స్పెషల్ ట్వీట్ చేశాడు. చరణ్ ఈ ట్వీట్ లో.. ”నా బ్రదర్ ప్రశాంత్ నీల్ కి, సినిమా నిర్మాతలు హోంబలే ఫిలిమ్స్ వారికి అభినందనలు. రాకీ.. డియర్ బ్రదర్ నీ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్. స్క్రీన్ మీద నీ నటన అద్భుతంగా ఉంది” అంటూ పోస్ట్ చేశాడు. అలాగే సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్, హీరోయిన్ శ్రీ నిధి శెట్టిలపై కూడా ప్రశంశలు కురిపించారు. ఇప్పటివరకు మీరు చేసిన వాటిల్లో ఇదే బెస్ట్ వర్క్. మ్యూజిక్ డైరెక్టర్ రవి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మిగిలిన టెక్నీషియన్స్ అందరికి అభినందనలు. అంటూ మరో ట్వీట్ కూడా చేశారు. దీంతో ‘కేజీఎఫ్‌ 2’ సినిమాపై చరణ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

KGF : ప్రశాంత్ నీల్ మన తెలుగువాడే.. ఈ రాజకీయ నాయకుడికి బంధువే.. మీకు తెలుసా??

ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ నార్త్ లో ఎక్కడ కనపడినా చరణ్ తో ఫోటోల కోసం ఎగబడుతున్నారు. చరణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు చరణ్ ‘కేజీఎఫ్‌ 2’ సినిమా పై ట్వీట్ చేయడంతో కన్నడ ప్రేక్షకులు, యశ్ అభిమానులు కూడా ఈ ట్వీట్ ని షేర్ చేస్తున్నారు.