Sirivennela : సిరివెన్నెలపై సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్

సిరివెన్నెల రాసిన చివరి పాటపై హీరోయిన్ సాయి పల్లవి స్పందిస్తూ ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది. ఈ పాట మరియు సిరివెన్నెల గురించి ట్వీట్ చేస్తూ.. ‘మీరు రాసిన ప్రతి పదం మీ ఆత్మను......

Sirivennela : సిరివెన్నెలపై సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్

Sai Pallavi

Sirivennela :  ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు, తెలుగు సాహిత్యానికి తీరని లోటు. ‘సిరివెన్నెల’ సినిమాతో ప్రారంభమైన ఆయన పాటల ప్రస్థానం ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో ముగిసింది. హీరో నాని, సాయిపల్లవి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో సిరివెన్నెల రెండు పాటలు రాశారు. అందులో ఆయన రాసిన చివరి పాటను నిన్న విడుదల చేశారు. ఈ పాటలో సిరివెన్నెల అనే పదం వాడారు. ఇదే ఆయన ఆఖరిపాట అవ్వడం బాధాకరం. సిరివెన్నెల మరణం తర్వాత సినీ ప్రముఖులంతా ఆయన గురించి సోషల్ మీడియాలో స్పందించారు. తాజాగా ఈ పాట విడుదల అవ్వడంతో సిరివెన్నెల రాసిన చివరి పాటపై హీరోయిన్ సాయి పల్లవి స్పందిస్తూ ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది.

Samantha : చైతూతో విడిపోయిన తర్వాత చనిపోతా అనుకున్నాను : సమంత

ఈ పాట మరియు సిరివెన్నెల గురించి ట్వీట్ చేస్తూ.. ‘మీరు రాసిన ప్రతి పదం మీ ఆత్మను తీసుకు వస్తోంది. ఎప్పటికీ మీరు మా హృదయాల్లో జీవించే ఉంటారు సార్‌’ అంటూ ఆ పాటని కూడా షేర్ చేసింది. ‘నెల రాజుని ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల….’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ నెల 24వ తేదీన ‘శ్యామ్ సింగరాయ్’ థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది.